Omicron: ఒమిక్రాన్పై భయం వద్దు.. భారతీయులు దీన్ని తట్టుకోగలరు
ఒమిక్రాన్ కానీ, మరేదైనా కొత్త వేరియంట్ను కానీ తట్టుకునే శక్తి అత్యధిక భారతీయులకు ఉన్నందున ఎవరూ భయాందోళనలు...
ప్రముఖ వైరాలజిస్టు జమీల్ వెల్లడి
దిల్లీ: ఒమిక్రాన్ కానీ, మరేదైనా కొత్త వేరియంట్ను కానీ తట్టుకునే శక్తి అత్యధిక భారతీయులకు ఉన్నందున ఎవరూ భయాందోళనలు చెందనక్కర్లేదని సుప్రసిద్ధ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ భరోసా ఇచ్చారు. అయితే, మాస్కులు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్స్ కన్సార్టియా (ఇన్సాకోగ్) సలహా సంఘానికి ఆయన గతంలో నాయకత్వం వహించారు. ‘‘భారతదేశంలో కొవిడ్ రెండో దశలో డెల్టా వేరియంట్ చాలా ఎక్కువ మందికి సోకింది. 67 శాతం మంది భారతీయుల్లో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు జాతీయ సీరో సర్వే సూచించడం దీనికి నిదర్శనం. అంటే దాదాపు 94 కోట్లమంది భారతీయుల్లో యాంటీబాడీలు ఏర్పడ్డాయన్నమాట. అప్పటికి దేశంలో కొవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీన్నిబట్టి కొవిడ్ సోకడం వల్లే ఎక్కువ మందిలో యాంటీబాడీలు ఉత్పన్నమైనట్లు స్పష్టమవుతోంది’’ అని జమీల్ వివరించారు. ఇదే భారతీయులకు ఒమిక్రాన్ వంటి వేరియంట్లను తట్టుకునే శక్తిని అందిస్తోందన్నారు. దిల్లీ జనాభాలో 97 శాతం మందికి, ముంబయి జనాభాలో 85-90 శాతం మందికి యాంటీబాడీలు ఉన్నట్లు ఇటీవలి సీరో సర్వే తేల్చిందని, కనుక ఒమిక్రాన్ కానీ, మరే ఇతర వేరియంట్ కానీ తీవ్ర రోగ లక్షణాలు కలిగించలేవని జమీల్ వివరించారు.
టీకాలు నిరుపయోగం కావు
ఒమిక్రాన్ రకంపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా అని ప్రపంచం ఆందోళన చెందుతోంది. దీనిపై పూర్తి సమాచారం రావడానికి ఇంకా ఒకటీ రెండు వారాలు పట్టవచ్చని జమీల్ చెప్పారు. ఒమిక్రాన్పై టీకాల సామర్థ్యం కొంత తగ్గినా, అవి బొత్తిగా పనిచేయకుండా పోయే ప్రసక్తి లేదని జమీల్ తెలిపారు. వ్యాక్సిన్లు కొవిడ్ తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు. ప్రజలు మాస్కులు ధరిస్తూనే ఉండాలన్నారు. టీకా కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ‘‘అదృష్టవశాత్తు భారత్ వద్ద దండిగా టీకాలు ఉన్నాయి. వాటిని జనాభాకు వేగంగా అందించే సామర్థ్యమూ ఉంది. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కొవిషీల్డ్ టీకా రెండు డోసులకు మధ్య వ్యవధిని ఇప్పుడున్న 16 వారాల నుంచి 12 వారాలకు తగ్గించాలి. ముఖ్యంగా పెద్ద వయసువారికి, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి, వైద్యులు, సహాయక సిబ్బందికి త్వరగా టీకాలు వేయాలి’’ అని పేర్కొన్నారు.
టీకా బూస్టర్ డోసుల వల్ల ప్రయోజనం ఉన్నా, అత్యధిక భారతీయులకు వేగంగా రెండు డోసులు వేయడం అంతకన్నా ముఖ్యమని జమీల్ ఉద్ఘాటించారు. భారత్లో అందుబాటులో ఉన్న టీకాల్లో 90 శాతం కొవిషీల్డేననీ, దాన్ని బూస్టర్ డోసుగా ఇవ్వడం వల్ల ప్రయోజనం పరిమితమేనని ఆయన వివరించారు. కాబట్టి బూస్టర్ డోసుగా ఆర్ఎన్ఏ, డీఎన్ఏ, ప్రోటీన్ వ్యాక్సిన్లను ఇవ్వడం మంచిదని సూచించారు. ఒమిక్రాన్ 25 ఏళ్ల లోపువారికే ఎక్కువగా సోకుతోందని వార్తల గురించి ప్రశ్నించగా, ఆ విషయమై పూర్తి సమాచారం లేదని చెప్పారు. ఇంతవరకు ఈ వేరియంట్ ఎక్కువగా 25 ఏళ్లలోపువారిలోనే కనిపిస్తున్న మాట నిజమే అయినా, చిన్న పిల్లలకు ఈ రకం వల్ల ప్రమాదం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి