Guinness World Records: స్కై డైవింగ్లో గింగిరాలు తిరుగుతూ గిన్నిస్ రికార్డు
అమెరికాకు చెందిన కెబేకేత్ ఎడ్వార్డ్ స్నైడర్ స్కైడైవింగ్ చేసి ప్రతిష్ఠాత్మక గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే అత్యంత ఎత్తు నుంచి దూకి కాదు..అత్యధికసార్లు గింగిరాలు తిరిగి......
ఇంటర్నెట్ డెస్క్: స్కై డైవింగ్ చూస్తేనే చాలా మంది ఒళ్లు గగురుపొడుస్తుంది. మరి చేసేవారి పరిస్థితేంటో అర్థం చేసుకోండి. అయితే కొందరు దాన్ని వ్యాపకంలా మార్చుకుంటారు. ఇష్టంగా ఇలాంటి సాహసాలు చేస్తుంటారు. అత్యంత ఎత్తు నుంచి దూకి రికార్డులు కూడా సాధిస్తుంటారు. అమెరికాకు చెందిన కెబేకేత్ ఎడ్వార్డ్ స్నైడర్ తాజాగా ప్రతిష్ఠాత్మక గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే అత్యంత ఎత్తు నుంచి దూకి కాదు.. కిందకు దూకుతూ.. అత్యధికసార్లు గింగిరాలు తిరిగి. ఈజిప్ట్లోని ప్రఖ్యాత గాజా పిరమిడ్ల వద్ద ఈ గత నెల 1వ తేదీన ఈ ఫీట్ను చేశాడు.
13,500 ఫీట్ల ఎత్తునుంచి కెబే ఈ సాహసం చేశాడు. విమానంలో నుంచి కిందకు దూకి.. భూమికి చేరుకునే క్రమంలో అతడు ఏకంగా 160 సార్లు తిరిగి గతంలో ఉన్న రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ డైవింగ్కు సంబంధించిన వీడియోలను అతడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారులకు పంపించాడు. ఆ వీడియోలను ధ్రువీకరించిన అధికారులు.. కెబే ఫీట్కు తాజాగా గిన్నిస్ రికార్డుల్లో స్థానం కల్పించారు. అతడి సాహసానికి సంబంధించిన వీడియోలను సైతం సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.
ఈ ఫీట్ సహా గిన్నిస్ రికార్డు పట్ల కెబేకేత్ హర్షం వ్యక్తం చేశాడు. పిరమిడ్ల పైన సర్ఫింగ్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నాడు. ఇలాంటి ఫీట్లు చాలా ప్రమాదకరమని.. దీని వెనుక ఏళ్ల కృషి ఉందని పేర్కొన్నాడు. ఇప్పటివరకు దాదాపు 250 మందికి స్కైడైవింగ్లో మెళుకువలు నేర్పినట్లు తెలిపాడు. కెబే గతంలో జాతీయ ఛాంపియన్ కూడా.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం