Dalai Lama: దలైలామా: నేను భారత్లోనే ఉంటా.. ఎందుకంటే?
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా (86) చైనా నాయకత్వాన్ని మరోసారి విమర్శించారు. భిన్న సంప్రదాయాల ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకోలేరని విమర్శించారు.
చైనా నియంత్రణ ఎక్కువైందన్న ఆధ్యాత్మిక గురువు
టోక్యో: బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా (86) చైనా నాయకత్వాన్ని మరోసారి విమర్శించారు. భిన్న సంప్రదాయాల ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకోలేరని విమర్శించారు. ముఖ్యంగా అక్కడి హాన్ వర్గ ఆధిపత్యం, నియంత్రణే ఎక్కువ ఉందన్నారు. అయితే, తోటి వ్యక్తిగా తనకు చైనా ప్రజలపై ఎటువంటి వ్యతిరేకత లేదన్నారు. కమ్యూనిజం, మార్క్సిజం భావాలకు తాను అనుకూలమన్న విషయాన్ని గుర్తుచేశారు. టోక్యో వేదికగా ఆన్లైన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మిక గురువు దలైలామా.. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా భారత్లోనే ఉంటానన్న ఆయన.. ఇక్కడే ప్రశాంతంగా ఉందని వెల్లడించారు.
చైనా అర్థం చేసుకోలేదు..
‘మావో జెడాంగ్ నుంచి కమ్యూనిస్టు పార్టీ నేతల గురించి నాకు తెలుసు. వారి ఆలోచనలు మంచివే. కానీ, కొన్నిసార్లు అత్యంత కఠినంగా నియంత్రణలు ఉంటాయి. అయితే, నేటితరం నేతల ఆలోచనల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా’ అని ఆధ్యాత్మిక గురువు దలైలామా పేర్కొన్నారు. టిబెట్, షిన్జియాంగ్ విషయానికొస్తే.. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక సంస్కృతి ఉంది. కాబట్టి అత్యంత సంకుచిత మనస్తత్వం కలిగిన చైనా నాయకులు ఇక్కడి ప్రత్యేక సంస్కృతులను అర్థం చేసుకోలేరు. చైనాలో హాన్ జాతికి చెందిన వారే కాకుండా భిన్న జాతులు, ఇతర వర్గాల ప్రజలు ఉన్నారు.. కానీ, హాన్ వర్గం ఆధిపత్యం, వారి నియంత్రణే అధికంగా ఉంటుందన్న మాట వాస్తవమని దలైలామా స్పష్టం చేశారు.
కమ్యూనిస్టు పార్టీలో చేరాలని..
ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టులు పలు అంతర్జాతీయ అంశాలతోపాటు చైనాకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. వీటికి సమాధానమిచ్చిన దలైలామా.. కమ్యూనిజం, మార్క్సిజం ఆలోచనలకు అనుకూలమన్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా ఒకసారి ఏకంగా కమ్యూనిస్టు పార్టీలోనే చేరాలనే ఆలోచన వచ్చిందని దలైలామా పేర్కొన్నారు. అప్పటి సంఘటనను నవ్వూతూ వివరించిన ఆయన.. ఇందుకు ఓ మిత్రుడు అభ్యంతరం చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక తైవాన్పైనా ఆయన స్పందించారు. చైనా నుంచి తైవాన్ ఆర్థికంగా ఎంతో సహాయం పొందుతున్న మాట వాస్తవమన్నారు. కానీ, బౌద్ధ మతం, చైనా సంస్కృతి విషయానికొస్తే తైవానీయుల నుంచి చైనా ప్రజలు ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
భారత్లోనే ఉంటా..
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను కలిసే ఆలోచన లేదని దలైలామా స్పష్టం చేశారు. కానీ, వయసు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడున్న తన మిత్రులను కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కానీ, చైనా-తైవాన్ మధ్య సంబంధాలు కాస్త సున్నితంగా మారినందున తైవాన్కు మాత్రం వెళ్లకపోవచ్చని పేర్కొన్నారు. ఇక భారత్లోనే ప్రశాంతంగా ఉంటానన్న దలైలామా.. మతసామరస్యానికి భారత్ కేంద్రబిందువని కొనియాడారు. అన్ని మతాల సారాంశము ఒక్కటేనని, కేవలం రాజకీయ నాయకులతోనే అసలు సమస్య అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మతాన్ని కూడా రాజకీయం చేశారని.. ఇప్పుడు అదే ప్రధాన సమస్య అని దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186