Bipin Rawat: కొవిడ్ వేళ.. 500శాతం పెరిగిన సైబర్ నేరాలు!
మహమ్మారి విజృంభణ సమయంలో దేశంలో సైబర్ నేరాలు పెరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా కొవిడ్ మొదలైనప్పటి నుంచి సైబర్ నేరాల్లో దాదాపు 500శాతం పెరుగుదల కనిపించినట్లు భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరోసారి గుర్తుచేశారు.
ఐటీ చట్టానికి సవరణలు అవసరమన్న త్రిదళాధిపతి
దిల్లీ: మహమ్మారి విజృంభణ సమయంలో దేశంలో సైబర్ నేరాలు పెరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా కొవిడ్ మొదలైనప్పటి నుంచి సైబర్ నేరాల్లో దాదాపు 500శాతం పెరుగుదల కనిపించినట్లు భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరోసారి గుర్తుచేశారు. ముఖ్యంగా డ్రోన్ల వినియోగం, రాన్సమ్వేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో కలిగే ముప్పును ప్రముఖంగా ప్రస్తావించారు. ‘c0C0n’ పేరుతో కేరళ పోలీసులు వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన 14వ ‘హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ’ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన జనరల్ బిపిన్ రావత్.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఐటీ చట్టాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఐటీ చట్టానికి సవరణలు అవసరం..
సైబర్ భద్రత కోసం రాష్ట్రస్థాయిలో సైబర్ సెల్లు, కేంద్ర స్థాయిలోనూ వివిధ శాఖలకు నిపుణులు ఉన్నారు. ఇందుకోసం వివిధ మంత్రిత్వ శాఖలు కూడా పలు ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. ఇలా డిజిటల్ సమాచారాన్ని సమర్థవంతంగా భద్రపరచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ జాతీయ స్థాయిలో ఈ వర్చువల్ స్పేస్ నిర్వహణ కోసం ఓ ప్రత్యేక ఫ్రేమ్వర్క్ అవసరం ఉందని త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. రోజురోజుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోన్న సమయంలో.. వీటితో ఎదురయ్యే ప్రమాదాలను కూడా అంచనా వేయాలన్నారు. ముఖ్యంగా డ్రోన్లు, రాన్సమ్వేర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలతో పొంచివున్న ముప్పును కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వర్చువల్ కరెన్సీ, బ్లాక్చెయిన్ వ్యాప్తి కూడా ఎక్కువైన నేపథ్యంలో మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా భారత చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐటీ చట్టం-2000కు సవరణలు చేయాల్సిన అవసరాన్ని జనరల్ బిపిన్ రావత్ నొక్కిచెప్పారు. దీనికి తోడు డేటా సంరక్షణ బిల్లు (Data Protection Bill) 2019 కూడా సాధ్యమైనంత తొందరగా చట్టరూపం దాల్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
లాక్డౌన్ సమయంలో చోటుచేసుకున్న ఆన్లైన్ మోసాలపై చర్చించే లక్ష్యంతో సొసైటీ ఫర్ ది పోలీసింగ్ ఆఫ్ సైబర్స్పేస్ (POLCYB), ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ (ISRA) స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కేరళ పోలీసులు ‘c0c0n’ సదస్సు నిర్వహించారు. ఇందులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొని సైబర్ సెక్యూరిటీపై కీలక ప్రసంగాలు చేశారు. సైబర్నేరాలు, హ్యాకింగ్పై ప్రజల్లో అవగాహన కలిగించడంతోపాటు ఆన్లైన్ తరగతులు జరుగుతోన్న సమయంలో ఎన్నో నేరాలు చోటుచేసుకున్న దృష్ట్యా ఆన్లైన్ భద్రతపై చిన్నారులకు కూడా దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం గతేడాది (2000) దేశవ్యాప్తంగా 50,035 సైబర్ నేరాలు నమోదయ్యాయి. 2019లో సుమారు 27వేల సైబర్ నేరాలు చోటుచేసుకోగా 2019లో 44వేలకు పెరిగాయి. గతేడాది దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ సమయంలోనూ సైబర్ నేరాల్లో దాదాపు 12శాతం పెరుగుదల కనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్