Covid Origins: కొవిడ్ మూలాలపై అమెరికా నివేదిక.. మరోసారి మండిపడ్డ చైనా!
కొవిడ్ మూలాలపై అమెరికా నిఘా విభాగం రూపొందించిన నివేదికపై చైనా మరోసారి మండిపడింది. కేవలం దాన్ని రాజకీయ, తప్పుడు నివేదికగా పేర్కొన్న చైనా.. తమపై దాడులు చేయడాన్ని మానుకోవాలని అమెరికాకు హితవు పలికింది.
మరోసారి దర్యాప్తునకు ససేమిరా
బీజింగ్: కొవిడ్ మూలాలపై అమెరికా నిఘా విభాగం రూపొందించిన నివేదికపై చైనా మరోసారి మండిపడింది. కేవలం దాన్ని రాజకీయ, తప్పుడు నివేదికగా పేర్కొన్న చైనా.. తమపై దాడులు చేయడాన్ని మానుకోవాలని అమెరికాకు హితవు పలికింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో మరోసారి దర్యాప్తునకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిద్ధమవుతోన్న వేళ చైనా ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
కొవిడ్ మూలాలపై ఆగస్టులో విడుదలైన నివేదికను గట్టిగా వ్యతిరేకించామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మరోసారి పేర్కొన్నారు. ఆ నివేదిక ఎన్నిసార్లు ప్రచురితమైనా, వాటిని మార్పులు చేసి ఎన్ని రకాల కట్టుకథలు అల్లినా.. వారి రాజకీయ, తప్పుడు స్వభావం అర్థమవుతూనే ఉంటుందని విమర్శించారు. కొవిడ్ మూలాలను గుర్తించే పేరుతో అమెరికా నిఘా విభాగం చేసిన ప్రయత్నాలు రాజకీయం చేస్తుందనడానికి గట్టి నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో చైనాపై దాడులు చేయడం, దుమ్మెత్తిపోసే చర్యలను ఆపివేయాలని వాంగ్ వెన్బిన్ విజ్ఞప్తి చేశారు.
కొవిడ్ మూలాలపై 90రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడి నిఘా విభాగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు కొవిడ్ మూలాలపై అమెరికా నిఘా విభాగం రెండు నెలల కిందటే ఓ నివేదికను రూపొందించింది. కొవిడ్ మూలాలపై కొత్తగా ఎటువంటి సమాచారం లేనందున కచ్చితంగా ఓ తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్లు అందులో పేర్కొంది. ముఖ్యంగా జంతువుల నుంచి మానవులకు సోకిందా లేక ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందా అనే విషయంపై స్పష్టత రాలేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ దర్యాప్తునకు చైనా అడ్డుతగులుతుందన్న అమెరికా.. వాటిపై తుది నిర్ణయానికి రావాలంటే చైనా మరింత సహకారం అందించాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో మరోసారి దర్యాప్తును వ్యతిరేకిస్తోన్న చైనా.. కొవిడ్ మూలాలపై అంతర్జాతీయ బృందం దర్యాప్తు జరపడాన్ని తప్పుబడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.