China Celebrity Missings: ఆట లేదు.. మాట లేదు.. మమ్మల్ని ధిక్కరిస్తే మాయమే..!
చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడి అధికారులపై ఆరోపణలు చేసినా.. చైనా అధినాయకుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే.
చైనాలో పెరుగుతోన్న సెలబ్రిటీల మిస్టరీ మిస్సింగ్లు
బీజింగ్: చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడి అధికారులపై ఆరోపణలు చేసినా.. చైనా అధినాయకుడి ఆగ్రహానికి గురి కావాల్సిందే. ఇలా అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని వినిపించే వారిని చైనా అణచివేస్తోందనే వాదనలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా అసమ్మతిని అణగదొక్కడంలో భాగంగా అలాంటివారి ఆచూకీ లేకుండా చేస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి. ఇలా గత కొంతకాలంలో చైనాలో ప్రముఖుల మిస్సింగ్లు మిస్టరీగా మారుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఆచూకీ కనిపించకుండా పోవడంపైన ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. కేవలం పెంగ్ షువాయినే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన జాక్ మా వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు, అక్కడి కళాకారులు, సినీనటులు, ఉన్నతాధికారులు, మీడియా అధినేతలతోపాటు ఎంతో మంది ప్రముఖుల ఆచూకీ తెలియకుండా పోతున్నాయనే ప్రపంచ వ్యాప్తంగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాటిలో కొన్ని మిస్టరీ కేసులపై ఓసారి గమనిస్తే..
అయ్ వీవీ: కళాకారుడు
కళాకారుడు, చిత్ర నిర్మాతైన అయ్ వీవీ చైనా ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తూ ఓ అసమ్మతివాదిగా ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా అక్కడి ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాల్లో ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తారు. దీంతో 2011లో ఆయనను అరెస్టు చేసిన ప్రభుత్వం.. దాదాపు 81రోజుల పాటు రహస్య ప్రదేశంలో నిర్బంధించింది. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల పాటు ఆయన పాస్పోర్టును నిలిపివేసింది. చైనాలో ఆచూకీ లేకుండా చేయడం ఎలా ఉంటుందో అని ప్రపంచానికి చాటిచెప్పిన అతికొద్ది మంది సెలబ్రిటీల్లో వీవీ ఒకరనే చెప్పవచ్చు. 2015లో చైనా నుంచి బయటకు వచ్చిన వీవీ.. అక్కడి జైలు జీవితాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. ముఖ్యంగా తినడం నుంచి నిద్రపోయేవరకు, స్నానం నుంచి మలవిసర్జన వరకూ ప్రతి నిమిషాన్ని అక్కడి గార్డులు ఎలా పర్యవేక్షించేవారో చెప్పుకొచ్చారు.
ఝావో వీ: నటి
పాశ్చాత్య సంప్రదాయం వల్లే తమ యువత పెడదారి పడుతోందని భావిస్తోన్న చైనా ప్రభుత్వం.. అక్కడి సెలబ్రిటీలపైనా కన్నేసింది. ముఖ్యంగా పాప్ కల్చర్ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల నుంచి అక్కడి యువతను దూరం చేస్తున్నట్లు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆగస్టు నెలలో అక్కడి ప్రముఖ పాప్ సింగర్ ఝావో కనిపించకుండా పోయారు. ఆమెకు చెందిన సమాచారం కూడా ఇంటర్నెట్ నుంచి అదృశ్యమయ్యింది. వీటికితోడు ఆమె సినిమాలు, టీవీ షోలు కూడా ఆన్లైన్ వేదికల నుంచి తొలగించబడ్డాయి. ఆ సమయంలో ఆమె కనిపించకుండా పోవడం మరోసారి చర్చనీయాంశమయ్యింది. కానీ, నెల రోజుల తర్వాత ఆమె స్వగ్రామంలో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆమె గృహ నిర్బంధంలో ఉన్నారా..? అనే విషయంపైనా స్పష్టత లేదు. తాజాగా ఓ ఆన్లైన్ షాపింగ్ కార్యక్రమంలో కనిపించినట్లు చైనాలోని ఓ ఇంటర్నెట్ పోర్టల్ వెల్లడించింది. కానీ, ఝావోపై అధికారిక సమాచారం మాత్రం ఇప్పటికీ తెలియదు.
మెంగ్ హాంగ్వే : ఇంటర్పోల్ చీఫ్
చైనాకు చెందిన మెంగ్ హాంగ్వే 2016లో ప్రపంచ వ్యాప్తంగా పోలీసులకు సహకారం అందించే ‘ఇంటర్పోల్’ విభాగానికి చీఫ్గా ఎన్నికయ్యారు. అంతకుముందు చైనాలో ప్రజాభద్రతా విభాగానికి ఇంఛార్జిగా ఉన్న మెంగ్ హాంగ్వే.. 2018లో అదృశ్యం కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చైనాకు బయలుదేరినట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత ఆయన ఆచూకీ లేకుండా పోయింది. దీనిపై ఆయన భార్య గ్రేస్ మెంగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫ్రాన్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలా మిస్టరీగా మారిన హాంగ్వేను ఓ కేసులో ప్రశ్నించడం కోసం చైనాకు తీసుకెళ్లినట్లుగా ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. లంచాలు స్వీకరిస్తున్నారనే ఆరోపణలపై 2020లో మెంగ్ను అరెస్టు చేసినట్లు చైనా ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ కేసులో ఆయనకు 13ఏళ్ల శిక్షపడినట్లు పేర్కొంది. దీంతో కిడ్నాపర్ల నుంచి ముప్పు పొంచివుందన్న ఆందోళన నేపథ్యంలో ఆయన భార్య గ్రేస్తో పాటు ఇద్దరు పిల్లలకు ఫ్రాన్స్ ఆశ్రయం కల్పించింది. ఈ మధ్యే తొలిసారి మీడియా ముందుకు వచ్చిన గ్రేస్ మెంగ్.. తన భర్త ఆచూకీ ఇప్పటికీ లభించలేదని వాపోయారు.
జాక్ మా : వ్యాపారవేత్త
చైనాలో శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన అలీబాబా గ్రూప్ సంస్థ అధినేత జాక్మా పైనా చైనా ప్రభుత్వం కన్నేసింది. గతేడాది అక్టోబరులో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా ప్రసంగిస్తూ.. చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. దీనిపై మండిపడ్డ చైనా ప్రభుత్వం.. ఆయనపై ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. ఆయనకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ ఐపీఓను అడ్డుకోవడంతోపాటు గుత్తాధిపత్య పద్ధతులను అమలు చేస్తోందనే ఆరోపణలపై ఆ సంస్థపై విచారణకు ఆదేశించింది. దీంతో జాక్మా ఆస్తుల విలువ ఒక్కసారిగా పడిపోయాయి. అదే సమయంలో జాక్ మా దాదాపు మూడు నెలల పాటు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన ఎక్కడున్నారన్నది మిస్టరీగా మారింది. ఒకనొక సమయంలో జాక్ మా చైనాను విడిచి వెళ్లిపోయారనే ఊహాగానాలు వినిపించాయి. చివరకు ఆయన ఇంటినుంచి ఓ వీడియో కాల్లో ప్రత్యక్షమయ్యారు.
గువై మిన్హాయ్ : ప్రచురణకర్త
చైనా రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూ హాంకాంగ్ వేదికగా ప్రచురణలు చేసే గువై మిన్హాయ్.. 2015లో అదృశ్యమయ్యారు. కొన్ని నెలలపాటు ఆయన ఆచూకీ ఎవ్వరికీ తెలియలేదు. మరుసటి ఏడాది చైనా అధికారిక మీడియాలో ప్రత్యక్షమైన గువై.. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో అరెస్టయినట్లు వెల్లడించారు. రెండేళ్ల తర్వాత కొన్ని ఆంక్షల నడుమ తాత్కాలికంగా విడుదల చేయడంతో పాటు వీడియో కాల్ చేసుకునేందుకు ఆయనకు చైనా అధికారులు అనుమతించారు. అదే సమయంలో ఓసారి మరో ఇద్దరు స్వీడన్ దౌత్యవేత్తలతో కలిసి ప్రయాణిస్తోన్న గువైని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో చైనా తీరుపై స్వీడన్తో పాటు యూరప్ దేశాలు మండిపడ్డాయి. ఇలా గువైని నిర్బంధించడం యూరప్ - చైనా దౌత్య సంబంధాలపై కూడా తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది.
పెంగ్ షువాయి : టెన్నిస్ క్రీడాకారిణి
చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్పై అక్కడి టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి లైంగిక ఆరోపణలు చేశారు. మరుసటి రోజు (నవంబర్ 2వ తేదీ) నుంచి పెంగ్ షువాయి కనిపించకుండా పోయారు. దీంతో ఆమె ఆచూకీపై ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ క్రీడాకారుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సెరెనా విలియమ్స్, మహిళల టెన్సిస్ సంఘం (WTA) కూడా పెంగ్ అదృశ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చణీయాంశం కావడంతో చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ స్పందించింది. పెంగ్ షువాయి ప్రస్తుతం ఆమె నివాసంలోనే ఉన్నారని.. త్వరలోనే పౌర సమాజం ముందుకు వస్తారని పేర్కొంది. అయినప్పటికీ చైనా ప్రభుత్వ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కేవలం వీరే కాకుండా గడిచిన దశాబ్ది కాలంలో ఎంతో మంది ప్రముఖులపై చైనా ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. కొవిడ్ విజృంభించిన సమయంలోనూ వుహాన్లో జర్నలిస్టు అదృశ్యమైన వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించేవారి, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులతో పాటు ఇతర సినీ ప్రముఖుల జాడ లేకుండా చేస్తోందని విమర్శలు ఎక్కువయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..