Door-to-Door Vaccine: విశాల దేశంలో.. ఇంటివద్దే టీకాలు అసాధ్యమే!
దేశంలో నెలకొన్న భిన్నమైన పరిస్థితుల దృష్ట్యా ఇంటివద్దే కొవిడ్-19 వ్యాక్సిన్ అందించడం ఆచరణ యోగ్యం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.
ప్రస్తుత విధానాన్ని రద్దు చేయలేమన్న సుప్రీం ధర్మాసనం
దిల్లీ: దేశంలో నెలకొన్న భిన్నమైన పరిస్థితుల దృష్ట్యా ఇంటివద్దే కొవిడ్-19 వ్యాక్సిన్ అందించడం ఆచరణ యోగ్యం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందులో భాగంగా టీకా పంపిణీలో ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని రద్దు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. వికలాంగులతో పాటు బలహీన వర్గాల వారికి ఇంటివద్దే (డోర్-టు-డోర్) వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
‘లద్దాఖ్లో ఉన్న పరిస్థితి కేరళలో లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర్ప్రదేశ్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. పట్టణ, నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇలా విశాల దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన సమస్యలు ఉన్నాయి.’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగానే కొనసాగుతోంని.. ఇప్పటికే దాదాపు 60శాతానికిపైగా ప్రజలకు తొలిడోసు అందించారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు ఇబ్బందులను కూడా అర్థం చేసుకోవాలని అభిప్రాయపడిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రస్తుతం టీకా పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని రద్దు చేయలేమని స్పష్టం చేసింది.
కొవిన్ పోర్టల్లో నమోదు చేసుకోవడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో వికలాంగులతోపాటు ఇతర వర్గాల వారికి ఇంటివద్దే వ్యాక్సిన్ అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ‘యూత్ బార్ అసోసియేషన్’ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈవిధంగా స్పందించింది. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు సుమోటోగా పర్యవేక్షిస్తున్నామన్న సుప్రీం ధర్మాసనం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యశాఖ అధికారులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని అర్థం చేసుకోగలమని అభిప్రాయపడింది.
మరణాలన్నీ నిర్లక్ష్యం వల్లే అని భావించలేం..
దేశంలో కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో సంభవించిన మరణాలు.. నిర్లక్ష్యం వల్లే అని భావించడం సరికాదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ముఖ్యంగా అవి వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగాయని ఊహించుకోలేమని స్పష్టం చేసింది. సెకండ్ వేవ్లో కొవిడ్ మరణాల నిర్లక్ష్యం వల్లే జరిగాయని పేర్కొంటూ.. బాధితుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, కొవిడ్ వల్ల చనిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు వారికి పరిహారం ఇచ్చే విషయమై ఇప్పటికే జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థకు ఆదేశాలు జారీ చేశామని సుప్రీం కోర్టు గుర్తుచేసింది. అలాంటి కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూపొందించే అవకాశం ఉందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ