భారత విమానాలపై మరికొంతకాలం నిషేధం
భారత్లో డెల్టా రకం కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇక్కడి నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల విమానాలపై విధించిన నిషేధాన్ని కెనడా మరోసారి పొడగించింది. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో
ఆంక్షలు పొడిగించిన కెనడా
ఒట్టావా: భారత్లో డెల్టా రకం కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇక్కడి నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల విమానాలపై విధించిన నిషేధాన్ని కెనడా మరోసారి పొడిగించింది. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భారత్ విమానాలపై కెనడా ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాజ్ఞల గడువు జులై 21తో ముగియనుంది. అయితే భారత్లో కరోనా వ్యాప్తి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ డెల్టా వేరియంట్ ఆందోళనకరంగానే ఉండటంతో విమానాలపై నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
ఆగస్టు 21 వరకు భారత్ నుంచి నేరుగా ప్రయాణికుల విమానాలను అనుమతించబోమని ఆ దేశ రవాణా మంత్రి ఒమర్ అల్ఘబ్రా వెల్లడించారు. ‘‘కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత్లో పరిస్థితులు ఇంకా తీవ్రంగానే ఉన్నాయి. అందుకే ప్రజారోగ్య సంస్థ సూచనల మేరకు భారత్ నుంచి విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తున్నాం. డెల్టా వేరియంట్ నుంచి మా దేశ ప్రజలను రక్షించేందుకు ఇదే ఉత్తమమైన మార్గం’’ అని ఒమర్ చెప్పుకొచ్చారు.
అయితే ‘థర్డ్ కంట్రీ’ ద్వారా భారత్ నుంచి ప్రయాణికులు తమ దేశానికి రావొచ్చని కెనడా తెలిపింది. ఇందుకోసం సదరు ప్రయాణికులు ఇంకో దేశంలో దిగి అక్కడ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. రెండు వారాల పాటు ఐసోలేషన్లో ఉండాలి. ఆ తర్వాత కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రంతో కెనడాకు రావొచ్చని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్