Omicron: ఒమిక్రాన్కు తక్షణమే అడ్డుకట్ట.. సులభ మార్గం ఏంటంటే!
ప్రమాదకరమైన వేరియంట్గా భావిస్తోన్న ఒమిక్రాన్కు తక్షణమే అడ్డుకట్ట వేయాలంటే అందుకు అవసరమైన బూస్టర్ డోసులు రూపొందించడమే సులభ మార్గమని ప్రముఖ వైరాలజిస్టు జాకబ్ జాన్ పేర్కొన్నారు.
ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ జాకబ్ జాన్
దిల్లీ: ప్రమాదకరమైన వేరియంట్గా భావిస్తోన్న ఒమిక్రాన్కు తక్షణమే అడ్డుకట్ట వేయాలంటే అందుకు అవసరమైన బూస్టర్ డోసులు రూపొందించడమే సులభ మార్గమని ప్రముఖ వైరాలజిస్టు జాకబ్ జాన్ పేర్కొన్నారు. ఇక ఈ వేరియంట్ థర్డ్వేవ్కు కారణం కాకపోవచ్చని అంచనా వేసిన ఆయన.. కొత్త వేరియంట్లతో బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లు రావడం సహజమేనని అన్నారు. అయినప్పటికీ ఆశాజనకంగా ఉంటూనే.. ఎటువంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికీ వైరస్ సోకే అవకాశం ఉందని (Breakthrough) నిపుణులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో జాకబ్ జాన్ ఈ విధంగా స్పందించారు.
భయం అవసరం లేదు..
‘మనదేశంలో 8 నెలల పాటు కొనసాగిన కొవిడ్-19 తొలివేవ్లో దాదాపు 30శాతం మంది భారతీయులు వైరస్ బారినపడ్డారు. అనంతరం మూడు నెలల పాటు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సెకండ్ వేవ్లో అత్యధికంగా 75 నుంచి 80శాతం (రీ ఇన్ఫెక్షన్లతో కలిపి) వైరస్కు గురయ్యారు. ఈ నేపథ్యంలో విస్తృత వేగంతో కొత్త వేరియంట్ విరుచుకుపడితే ఏమవుతుందో అంచనా వేయలేం. అయితే, ప్రజలు భయపడుతున్నంత భయం మాత్రం ఉండకపోవచ్చు. థర్డ్ వేవ్కు కూడా ఇది కారణం కాకపోవచ్చు. అయినప్పటికీ వైరస్ను రాకుండా చూసుకోవడంతోపాటు రోగనిరోధకత (హెర్డ్ ఇమ్యునిటీ)ని పెంచుకోవడమే తెలివైన మార్గం’ అని ఐసీఎంఆర్కు చెందిన ‘సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ వైరాలజీ’ మాజీ డైరెక్టర్ డాక్టర్ జాకబ్ జాన్ పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ వేగం పెంచాలి..
‘దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 30శాతం మందికి పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) వ్యాక్సిన్ అందింది. వీటిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వ్యాక్సిన్ తీసుకోని వారికి వ్యాక్సిన్ అందించడం, రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ ఇవ్వడం అత్యంత ముఖ్యం. వేరియంట్కు తక్షణమే అడ్డుకట్ట వేసేందుకు బూస్టర్ డోసులను అందించడమే తేలికైన మార్గం. పిల్లలకు, గర్భిణీలకు వ్యాక్సిన్ (పూర్తి మోతాదులో) ఇవ్వాలి’ అని జాకబ్ జాన్ పేర్కొన్నారు. ఇక కొత్త వేరియంట్లను వ్యాక్సిన్లు ఏమేరకు ఎదుర్కొంటాయి? అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ (Breakthrough) బారినపడడం సహజమేనన్నారు. కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించడంతోపాటు వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు కావాల్సిన రోగనిరోధకతను బూస్టర్ డోసుల వల్ల పొందవచ్చని స్పష్టం చేశారు.
డెల్టా కంటే ప్రమాదకరమే..?
ఇక ఒమిక్రాన్లో ఇప్పటి వరకు 34 మ్యుటేషన్లు జరిగినట్లు పేర్కొన్న జాకబ్ జాన్, ఆందోళనకర ఆల్ఫా బీటా, గామా, డెల్టా వేరియంట్ కంటే ఇవి ఎక్కువేనని వెల్లడించారు. ఒరిజినల్ వేరియంట్తో పోలిస్తే డెల్టాకు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వ్యాప్తిచెందే గుణం దీనికి ఉందన్నారు. ఒమిక్రాన్కు అంతకంటే ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. దాదాపు పదిరెట్లు ఎక్కువ వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్నట్లు స్విట్జర్లాండ్కు చెందిన ఓ శాస్త్రవేత్త తనతో చెప్పినట్లు వివరించారు. అంతేకాకుండా రెండు డోసుల వల్లే కలిగే రోగనిరోధకతను తట్టుకునే సామర్థం ఈ కొత్త వేరియంట్కు ఉండే అవకాశం ఉన్నందున బూస్టర్ డోసులను రూపకల్పనకు నడుం బిగించాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు