Omicron: ఒమిక్రాన్ వెలుగుచూసిన వేళ.. వీరి జాడ లేకపోతే ఎలా..?
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరం మొదలైంది. కర్ణాటకలో ఇద్దరిలో ఇప్పటికే ఆ వేరియంట్ గుర్తించారు. ఇప్పుడు మరింత ఆందోళన కలిగించే వార్తను అక్కడి బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లోనూ విదేశాల నుంచి వచ్చిన 30 మందికోసం గాలింపు
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరం మొదలైంది. కర్ణాటకలో ఇద్దరిలో ఇప్పటికే ఆ వేరియంట్ గుర్తించారు. ఇప్పుడు మరింత ఆందోళన కలిగించే వార్తను అక్కడి బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) వెల్లడించింది. ఆఫ్రికన్ దేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన సుమారు 10 మంది ప్రయాణికుల జాడ దొరకలేదని బీబీఎంపీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని బీబీఎంపీ కమిషనర్ గౌరవ్ గుప్త తెలిపారు. ‘ట్రాకింగ్ అనేది నిరంతర ప్రక్రియ. దాని మేం కొనసాగిస్తాం. ఎవరైనా ఫోన్ ద్వారా స్పందించకపోతే.. మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తాం’ అని వెల్లడించారు.
‘దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వెలుగుచూసిన తర్వాత ఆ ప్రాంతం నుంచి 57 మంది బెంగళూరుకు వచ్చారు. వారిలో 10 మంది జాడను బీబీఎంపీ గుర్తించలేకపోయింది’ అని కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. వారికి ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాప్ అని వస్తోందని, చెప్పిన చిరునామాలో వారు లేరన్నారు.
ఆంధ్రప్రదేశ్లోనూ అలర్ట్.. 30 మంది కోసం వెతుకులాట..
ఈ కొత్త వేరియంట్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన 30 మంది కోసం ఆంధ్రప్రదేశ్ అధికారులు శోధిస్తున్నారు. గత పది రోజుల వ్యవధిలో 60 మంది విదేశాల నుంచి వచ్చారని వారు వెల్లడించారు. వారిలో 9 మంది ఆఫ్రికా నుంచి వచ్చారన్నారు. 30 మంది ప్రయాణీకులు విశాఖలోనే ఉండగా.. మిగిలిన 30 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు ఓ మీడియా సంస్థ నివేదించింది. వారు ఫోన్ కాల్స్కు కూడా దొరకడం లేదని సమాచారం. వారిని గుర్తించాలని రాష్ట్ర యంత్రాంగం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం వీరి జాడ తెలియకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇదిలా ఉండగా.. సుమారు రెండు వారాల వ్యవధిలో ఆఫ్రికా దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ముంబయికి చేరుకున్నారు. వారిలో 400మందికి పైగా ఆచూకీని మాత్రమే అధికారులు గుర్తించారు. మరోపక్క బిహార్కు వచ్చిన 281 మందిలో సుమారు 100 మంది కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి తలెత్తడానికి గల కారణం.. ప్రయాణికులు పాస్పోర్టుల్లో ఇచ్చిన చిరునామాల్లో ఉండకపోవడమేనని తెలుస్తోంది. వీరి ద్వారా కొత్త వేరియంట్ స్థానికంగా వ్యాప్తి చెందే ముప్పుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
వలపువలలో గుజరాత్ యువకుడు
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐఎస్ఐ)కు భారీ ఎత్తున భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో గుజరాత్లో ఓ యువకుడిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
సుస్థిర నాయకత్వం నేటి అవసరం
ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, పోటీతత్వం, అధికార ప్రాబల్యం చేతులు మారే ధోరణి ఈ దశాబ్దం అంతానికి బాగా పెరుగుతాయనీ, ఈ సంక్లిష్ట సమయంలో భారతదేశానికి పరిణత, సమర్థత ఉన్న సుస్థిర నాయకత్వం అవసరమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. -
దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ పుణెలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. -
అహ్మదాబాద్ పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిళ్ల మూలాలు పాక్లో..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 7న పోలింగ్ జరగడానికి ముందు రోజు 36 పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
మాల్దీవులను పూర్తిగా వీడిన భారత సైన్యం
మాల్దీవుల నుంచి భారత సైన్యం పూర్తిగా వెనుదిరిగింది. తమ దేశంలో ఉన్న చివరి భారత సైనిక బృందం స్వదేశానికి పయనమైనట్లు మాల్దీవుల అధ్యక్ష ప్రతినిధి హీనా వాల్దీద్ శుక్రవారం వెల్లడించారు. -
త్వరలో ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలుగా అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాల పరిశోధనలు
అంటార్కిటికా, ఆర్కిటిక్, హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాలº్ల భాగం కానున్నాయి. ఇందుకోసం కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
అమల్లోకి ఇంటర్ సర్వీసెస్ఆర్గనైజేషన్స్ చట్టం
ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ కంట్రోల్, డిసిప్లైన్) చట్టాన్ని గెజిట్లో ప్రచురించారు. ఆ ప్రకారం ఈ నెల 10 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. -
బసవేశ్వరుని ఆశయసిద్ధికి కృషి : మోదీ
పన్నెండో శతాబ్దానికి చెదిన రాజనీతిజ్ఞుడు, కవి, తత్వవేత్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!