Army Helicopter Crash: జమ్మూకశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌

జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్‌ కూలిపోయింది. కథువాలోని రంజిత్‌ సాగర్‌ డ్యాం సమీపంలో ఈ ఘటన జరిగింది.

Updated : 03 Aug 2021 12:30 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కథువాలో భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్‌ కూలిపోయింది. రంజిత్‌ సాగర్‌ డ్యాం సమీపంలో ఆర్మీ ఏవియేషన్‌ ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ హెలికాప్టర్‌ కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తూ అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సాధారణ శిక్షణ నిమిత్తం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ నుంచి బయల్దేరిన ఈ విమానం కథువా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. అయితే సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణమా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఆర్మీ ఉన్నతస్థాయి వర్గాలు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని