China: కరోనాపై ప్రశ్నించి.. మరణం అంచులకు చేరింది..!
చైనా ప్రభుత్వం తన పాలనను వ్యతిరేకించిన సొంత ప్రజలపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడదని పలుమార్లు వెల్లడైంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా పుట్టిల్లైన వుహాన్ నగరంలో పరిస్థితుల్ని ప్రశ్నించిన ఓ సిటిజెన్ జర్నలిస్టు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మరణం అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
చైనాలో ఓ జర్నలిస్టు పరిస్థితి ఇది..
బీజింగ్: చైనా ప్రభుత్వం తన పాలనను వ్యతిరేకించిన సొంత ప్రజలపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడదని పలుమార్లు వెల్లడైంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ నగరంలో పరిస్థితుల్ని ప్రశ్నించిన ఓ సిటిజెన్ జర్నలిస్టు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మరణం అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి జైలు పాలైన ఆమె.. తనకు విధించిన శిక్షను వ్యతిరేకిస్తూ జైల్లో నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. దాంతో ఆమెను వెంటనే విడుదల చేయాలని హక్కుల సంఘాలు పిలుపునిస్తున్నాయి.
చైనాకు చెందిన ఝాంగ్జాన్ (38) గతంలో న్యాయవాదిగా పనిచేసేవారు. ఆమె 2020లో వుహాన్ నగరంలో పర్యటించారు. మహమ్మారికి కేంద్ర బిందువుగా భావిస్తోన్న ఆ నగరంలోని పరిస్థితుల్ని తన వీడియోల్లో బంధించేవారు. వైరస్ వ్యాప్తి, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై అధికారుల్ని ప్రశ్నించేవారు. ఆ పాత్రికేయురాలి తీరు ప్రభుత్వాన్ని ఇరుకునపడేసేలా ఉండటంతో గతేడాది మేలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే చర్యల ద్వారా ఇబ్బందులు సృష్టిస్తున్నారనే నెపంతో డిసెంబర్లో ఆమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. ప్రభుత్వంపై వచ్చే అసమ్మతిని అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం ఉపయోగించే చట్టాన్నే ఈమెపై ప్రయోగించి.. జైలు గోడలకు పరిమితం చేశారు.
అయితే ఝాంగ్జాన్ చాలా బలహీనంగా ఉన్నారని, ఇంకా ఎక్కువ కాలం బతకరంటూ ఆమె సోదరుడు ట్విటర్లో పోస్టు చేసిన వీడియో ద్వారా ఆమె పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ‘ఈ చలికాలంలో ఆమె బతికే అవకాశం లేకపోవచ్చు’ అని ట్విటర్లో రాయడంతో పాటు జాగ్రత్తగా ఉండాలని తన సోదరికి సలహా ఇచ్చారు. దాంతో అక్కడి హక్కుల సంఘాలు ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా చైనా ప్రభుత్వానికి ఇదే అభ్యర్థన చేసింది. ఆమెను విడుదల చేస్తే, వెంటనే నిరాహార దీక్ష మానివేస్తుందని వెల్లడించింది. ఇప్పుడామెకు వైద్యం చాలా అవసరమని తెలిపింది. ఆమెను జైల్లో పెట్టడం.. ‘మానవ హక్కులపై సిగ్గుమాలిన దాడి’ అని ఆమ్నెస్టీకి చెందిన కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు. ఆలస్యం కాకముందే ఆమె విడుదలయ్యేలా చైనా ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని ఓ మీడియా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మరోపక్క షాంఘై మహిళా జైల్లో ఉన్న ఝాంగ్జాన్ను కలిసేందుకు ఆమె కుటుంబానికి అనుమతి దక్కడం లేదు. ఆహారం తీసుకోకుండా నిరసన వ్యక్తం చేస్తోన్న ఆమెకు.. బలవంతంగా ఆహారం అందిస్తున్నారని కొద్దికాలం క్రితం ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
చైనాలోని వుహాన్ నగరమే కరోనాకు మూలమని ప్రపంచమంతా విశ్వసిస్తోంది. అందుకు తగ్గట్టే గతేడాది ప్రారంభంలో ఆ నగరం వైరస్ ధాటికి వణికిపోయింది. దీంతో అక్కడి ప్రభుత్వం కఠినమైన కట్టడి చర్యలను అమలు చేసి, వైరస్కు చెక్ పెట్టామని ప్రకటించింది. ఆ సమయంలో ప్రపంచ దేశాలు వైరస్ తీవ్రతతో వణికిపోయాయి. దాంతో అక్కడి ప్రభుత్వం కరోనా కేసులు, మరణాల్ని కప్పిపుచ్చుతుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ప్రశ్నించినవారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఝాంగ్జాన్ కూడా ఆ జాబితాలోకే వచ్చారు. ఆమెతో పాటు వుహాన్లో రిపోర్టింగ్ చేసిన నలుగురు సిటిజెన్ జర్నలిస్టుల్ని డ్రాగన్ ప్రభుత్వం అరెస్టు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు