ఆన్లైన్ గేమ్లు ఆడొద్దన్నారని రూ.33 లక్షలతో బాలుడు పరార్
ఆన్లైన్ గేములు ఆడవద్దని తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో.. నగదు, బంగారు నగలతో ఓ బాలుడు నేపాల్ వెళ్లిపోయేందుకు యత్నించాడు. చివరికి పోలీసులు పట్టుకొని శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
చెన్నై(క్రైం), న్యూస్టుడే: ఆన్లైన్ గేములు ఆడవద్దని తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో.. నగదు, బంగారు నగలతో ఓ బాలుడు నేపాల్ వెళ్లిపోయేందుకు యత్నించాడు. చివరికి పోలీసులు పట్టుకొని శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నై, పాతచాకలిపేటకి చెందిన వెంకట్కుమార్, చెన్నై తాగునీటి బోర్డులో కాంట్రాక్టరు. అతని 15 ఏళ్ల కుమారుడు ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. గమనించిన తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో మనస్తాపానికి గురైన బాలుడు వారితో మాట్లాడటం మానేశాడు. ఈ క్రమంలోనే 17వ తేదీ రాత్రి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. ఇంట్లో ఉన్న రూ.33 లక్షల నగదు, 213 సవర్ల బంగారు నగలు కూడా కనిపించలేదు. దీనిపై తల్లిదండ్రులు చాకలిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు తాంబరంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నగలను తాంబరంలో తాకట్టు పెట్టడానికి యత్నించాడని, నేపాల్ వెళ్లడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ