Doctor: ఒకే వైద్యుడు.. 7 గంటల్లో 101 కు.ని. శస్త్రచికిత్సలు
నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేవలం ఏడు గంటల వ్యవధిలో ఒక వైద్యుడు ఏకంగా 101 మంది మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేశారు.
దర్యాప్తునకు ఛత్తీస్గఢ్ సర్కారు ఆదేశం
రాయ్పుర్: నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేవలం ఏడు గంటల వ్యవధిలో ఒక వైద్యుడు ఏకంగా 101 మంది మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేశారు. సర్గూజ జిల్లా నర్మదాపుర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత నెల 27న ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో ఈ శస్త్రచికిత్సలు జరిగాయి. మార్గదర్శకాల ప్రకారం ఒక వైద్యుడు రోజులో గరిష్ఠంగా 30 ఆపరేషన్లు మాత్రమే చేయాల్సి ఉంది. చికిత్సలు చేయించుకున్న మహిళల ఆరోగ్యం బాగున్నప్పటికీ, నిబంధనలు అతిక్రమించినందున సమాధానం ఇవ్వాలని ఆపరేషన్లు చేసిన వైద్యుడు డాక్టర్ జిబ్నస్ ఎక్కాతో పాటు పర్యవేక్షించిన సమితి వైద్యాధికారి డాక్టర్ ఆర్.ఎస్.సింగ్లకు నోటీసులు ఇచ్చింది. శిబిరానికి చాలా మంది మారుమూల గ్రామాల మహిళలు వచ్చారని, మరోసారి రావడం కష్టమవుతుందని చెప్పి అదే రోజున ఆపరేషన్లు చేయాలని కోరారని వైద్యులు వివరణ ఇచ్చారు. దాంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆపరేషన్లు చేసినట్టు తెలిపారు. అయినా సంతృప్తి చెందని ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేసింది. 2014లో బిలాస్పుర్ జిల్లాలో ఇదే తరహాలో ఆపరేషన్లు చేయగా 83 మంది మహిళల్లో తదనంతర సమస్యలు వచ్చాయి. అందులో 13 మంది మరణించారు. అప్పటి నుంచి రోజువారీ ఆపరేషన్లపై పరిమితి విధించింది. దాన్ని ఉల్లంఘించడాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి