Artificial intelligence: ఊపిరితిత్తుల క్యాన్సర్లను గుర్తించే కృత్రిమ మేధ
ఊపిరితిత్తుల క్యాన్సర్లను 90 శాతానికి పైగా కచ్చితత్వంతో గుర్తించే ఒక కృత్రిమ మేధ (ఏఐ) విధానాన్ని అమెరికా
వాషింగ్టన్: ఊపిరితిత్తుల క్యాన్సర్లను 90 శాతానికి పైగా కచ్చితత్వంతో గుర్తించే ఒక కృత్రిమ మేధ (ఏఐ) విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దాదాపు 800 మందిపై జరిపిన పరిశోధనలో ఇది తన సత్తాను చాటింది. క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణం ఊపిరితిత్తుల క్యాన్సరే. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మందికిపైగా బలవుతున్నారు. ఈ వ్యాధిని గుర్తించేందుకు వాడే ‘లో డోస్ కంప్యూటెడ్ టొమోగ్రఫీ స్క్రీనింగ్’ పరీక్షను ఎక్కువ మంది చేయించుకోవడంలేదు. తప్పుడు ఫలితాల వల్ల ఇబ్బందులు, పరీక్షతో వెలువడే రేడియోధార్మికత వంటివి ఇందుకు ప్రతిబంధకాలవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అందువల్ల మెరుగైన ప్రత్యామ్నాయ స్క్రీనింగ్ విధానాలు అవసరమయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము ‘డీఎన్ఏ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఫర్ ఎర్లీ ఇంటర్సెప్షన్’ (డెల్ఫీ) అనే విధానాన్ని అభివృద్ధి చేసినట్లు జాన్స్ హాప్కిన్స్ కిమెల్ క్యాన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఏఐతో పనిచేస్తుందన్నారు. బాధితుల రక్త నమూనాల్లో.. క్యాన్సర్ కణాల నుంచి వెలువడే డీఎన్ఏ అవశేషాల్లోని నిర్దిష్ట పోకడలను ఇది గుర్తిస్తుందన్నారు. తద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ను పసిగడుతుందని చెప్పారు. ప్రొటీన్ బయోమార్కర్ ఆధారిత విధానం, కంప్యూటెడ్ టొమోగ్రఫీలతో కలిపి ఉపయోగించినప్పుడు ఇది ఒకటి, రెండు దశల క్యాన్సర్ను 91 శాతం; మూడు, నాలుగు దశలను 96 శాతం కచ్చితత్వంతో కనుగొందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం