Corona: దేశంలో 67శాతం మందిలో యాంటీబాడీలు!
దేశ జనాభాలో 67శాతం మందిలో కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఐసీఎంఆర్ సెరో సర్వేలో వెల్లడి
దిల్లీ: దేశ జనాభాలో 67శాతం మందిలో కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే మరో 40కోట్ల మందికి ఇన్ఫెక్షన్ ముప్పు పొంచివుందని హెచ్చరించింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) జాతీయ స్థాయిలో చేపట్టిన నాలుగో సెరో సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
50శాతం పిల్లలకు కరోనా..?
దేశంలో కరోనా వైరస్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సెరో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్-జులై మధ్యకాలంలో భారత వైద్య పరిశోధనా మండలి జాతీయ స్థాయిలో నాలుగో సెరో సర్వే చేపట్టింది. ఇందుకోసం ఈసారి చిన్నారులను కూడా పరిగణలోకి తీసుకుంది. ఇలా దేశంలో 6ఏళ్ల వయసుపైబడిన 67.6శాతం మందిలో కొవిడ్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 6-17ఏళ్ల వయసున్న వారిలో 50శాతం కొవిడ్ ప్రభావానికి గురైనట్లు తాజా సర్వేలో తేలింది. ఇక 45-60ఏళ్ల వయసున్న వారిలో అత్యధికంగా (77.6శాతం) యాంటీబాడీలు ఉండగా.. 60ఏళ్లకు పైబడిన వారిలో ఇవి 76శాతం ఉన్నట్లు వెల్లడైంది.
85శాతం ఆరోగ్య కార్యకర్తల్లో..
దేశవ్యాప్తంగా జరిపిన నాలుగో సెరో సర్వేను 21రాష్ట్రాల్లోని 70జిల్లాల్లో చేపట్టారు. ఇందులో మొత్తం 28,975 మంది సాధారణ ప్రజలు పాల్గొనగా.. 7252 మంది ఆరోగ్య సంరక్షణ వర్కర్లను పరీక్షించారు. ప్రతి జిల్లా నుంచి కనీసం 100మంది ఆరోగ్య కార్యకర్తలు ఉండేట్లు చూసుకున్నారు. ఇలా సర్వేలో పాల్గొన్న మొత్తం ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో 85శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 90శాతం మంది వ్యాక్సిన్ పొందినవారేనని తెలిపింది.
ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోవచ్చు..
ప్రాథమిక పాఠశాలలు తెరవడంపైనా కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. వైరస్ గ్రాహకాలు (Ace receptors) చిన్నారుల్లో తక్కువగా ఉన్న కారణంగా వారిలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి తక్కువగా ఉండనున్నట్లు ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. అందుచేత ఉపాధ్యాయులు, సిబ్బంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకుంటే ప్రాథమిక పాఠశాలలు తెరచుకోవచ్చని సూచించింది. ఇక భారత్లో ఎక్కువ మంది చిన్నారులు వైరస్ను ఎదుర్కోవడం వల్ల వారిలో సహజసిద్ధమైన రోగనిరోధక శక్తి వృద్ధి చెందిందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ఎయిమ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలోనూ సీరో పాజిటివిటీ రేటు పెద్దల కంటే పిల్లల్లోనే ఎక్కువగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
సమూహాలకు దూరంగా ఉండాల్సిందే..
దేశంలో మూడో వంతు మందిలో ఇప్పటికే కొవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినప్పటికీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో 40కోట్ల మందికి వైరస్ బారినపడే ముప్పు ఉన్న నేపథ్యంలో సామాజిక, మతపరమైన, రాజకీయ సమావేశాలను నిర్వహించవద్దని హెచ్చరించింది. అవసరం లేని ప్రయాణాలకూ ప్రజలు దూరంగా ఉండాలని తెలిపింది. కేవలం రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ప్రయాణాలు చేయవచ్చని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.