Sameer Wankhede: మంత్రి గారూ.. ఆరోపించడం కాదు, రుజువు చూపించండి..!
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తన మతమార్పిడి గురించి వస్తోన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలకు సూటిగా బదులిచ్చారు. తన మొదటి వివాహం గురించి మాలిక్ ట్విటర్లో ఫొటో షేర్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
మాలిక్ చేసిన ట్వీట్కు బదులిచ్చిన వాంఖడే
ముంబయి: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ (Aryan Khan) అరెస్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన NCB జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే (Sameer Wankhede) తన మతమార్పిడి గురించి వస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik) చేసిన వ్యాఖ్యలకు సూటిగా బదులిచ్చారు. తన మొదటి వివాహం గురించి మాలిక్ ట్విటర్లో ఫొటో షేర్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
‘నా తండ్రి హిందువు. నా తల్లి ముస్లిం. వారిద్దరంటే నాకెంతో ప్రేమ. నేను ఇస్లాం సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవాలని మా అమ్మ కోరింది. అదే నెల నేను స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద నా వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నాను. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకుంటే.. ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చట్టబద్ధంగా మేం విడిపోయాం. నేను పుట్టుకతోనే హిందువును. ఇప్పటికీ హిందువునే. ఎలాంటి మతమార్పిడి జరగలేదు. అదే జరిగుంటే.. నవాబ్ మాలిక్ ఆ ధ్రువపత్రం చూపించాలి. నా మొదటి వివాహానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని నా తండ్రి చూపిస్తారు’ అని వాంఖడే స్పష్టం చేశారు.
నిఖానామా జరిగింది: సమీర్ భార్య
మాలిక్ షేర్ చేసిన చిత్రంపై సమీర్ వాంఖడే రెండో భార్య క్రాంతి రేడ్కర్ మీడియాతో మాట్లాడారు. ‘నిఖానామా నిజమే. ఆ వివాహం జరిగింది. కానీ, సమీర్ తన కులం, మతం మార్చుకోలేదు. మా అత్తయ్య ముస్లిం కావడంతో ఆమె సంతోషం కోసం ఈ పద్ధతిలో వేడుక జరిగింది. అలాగే నవాబ్ మాలిక్ షేర్ చేసిన జన్మ ధ్రువపత్రం నిజమైంది కాదు’ అని వెల్లడించారు. సమీర్ వాంఖడేకు ముస్లిం పద్ధతిలో జరిగిన వివాహానికి సంబంధించిన ఫొటోను ఈ రోజు మాలిక్ ట్విటర్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు మూడు వారాల క్రితం ముంబయిలోని క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు (Cruise Ship Party)లో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సమీర్ వాంఖడేపై మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకోవైపు ఆర్యన్ ఖాన్ విడుదలకు అతడి తండ్రి షారుఖ్ (Sharukh Khan) నుంచి రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఈ కేసులో సాక్షి ఆరోపించాడు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్సీబీ (NCB) వాంఖడేపై విచారణ జరుపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM