Vaccination: పేరుకుపోతున్న టీకా నిల్వలు.. రాష్ట్రాల వద్ద 15 కోట్ల డోసులు!
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కాస్త మందగించినట్లు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం నవంబర్ 5 నాటికి దాదాపు 108కోట్ల డోసులను పంపిణీ చేశారు.
10 కోట్ల మంది రెండో డోసుకు దూరం
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కాస్త మందగించినట్లు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం నవంబర్ 5 నాటికి దాదాపు 108 కోట్ల డోసులను పంపిణీ చేశారు. మరో 15 కోట్ల 54లక్షల డోసులు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వద్దే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు ఇప్పటివరకు మొత్తం 116 కోట్ల డోసులను ఉచితంగా అందజేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన సమయంలో టీకా కొరత ఉన్నట్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన రాష్ట్రాలు.. ప్రస్తుతం పంపిణీలో మాత్రం డీలా పడినట్లు తెలుస్తోంది.
10 కోట్ల మంది రెండో డోసుకు దూరం..
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై పది నెలలు కావొస్తున్నా.. ఇప్పటివరకు 32 శాతం మందికి మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందించారు. కనీసం 77 శాతం అర్హులకు ఒక డోసు పంపిణీ చేశారు. వీరిలో దాదాపు 10 కోట్ల మంది రెండో డోసు తీసుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మధ్యే ఆందోళన వ్యక్తం చేసింది. నిర్లక్ష్యం చేయకుండా రెండో డోసు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా వ్యాక్సిన్ మందకొడిగా సాగుతున్న రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న జిల్లాల్లో ఇంటింటికీ వెళ్లి టీకా అందించాలని సూచించింది.
48 జిల్లాల్లో 50 శాతం కంటే తక్కువే..
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తొలి డోసు అందించడంలో రాష్ట్రాలన్నీ ముందంజలో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా పలు జిల్లాలు మాత్రం వెనుకబడిపోయాయి. దేశంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైన (18 ఏళ్ల వయసు పైబడిన) వారిలో సరాసరి 77 శాతం మంది కనీసం ఒకడోసు అందుకున్నారు. కానీ, దేశవ్యాప్తంగా 48 జిల్లాల్లో మాత్రం కేవలం 50శాతం మంది మాత్రమే ఒకడోసు తీసుకున్నారు. మొత్తంగా 13 రాష్ట్రాల్లో ఈ సమస్య ఉండగా ఈశాన్య రాష్ట్రాలు వ్యాక్సిన్ పంపిణీలో మరింత వెనుకబడిపోయాయి. నాగాలాండ్లో ఓ జిల్లాలో కేవలం 16 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందింది. ఝార్ఖండ్లో మొత్తం 24 జిల్లాల్లో 10జిల్లాల్లో వ్యాక్సిన్ పంపిణీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయా రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
దేశవ్యాప్తంగా సెప్టెంబరులో రోజువారీగా 78 లక్షల డోసులను పంపిణీ చేయగా అక్టోబర్ నాటికి 56 లక్షలకు తగ్గింది. తొలిడోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు గడువు దాటిపోయినప్పటికీ చాలా మంది ముందుకు రావడం లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు డోసు విషయంలో ప్రజలు కాస్త ఉదాసీనత వహిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. కొవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదని.. దీనికితోడు పండగల సీజన్ కూడా మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న జిల్లా అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్