Pakistan: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి

పాకిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 20 మంది మృతి చెందారు. మరో 200 మందికి పైగా గాయాలయ్యాయి.

Updated : 07 Oct 2021 09:40 IST

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 20 మంది మృతి చెందారు. మరో 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ తెల్లవారుజామున బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. భూప్రకంపనలతో క్వెట్టాలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6గా నమోదైంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని