Taiwan: చైనాకు ‘కీల్’ నొప్పి..!
చైనా కబంధ హస్తాల్లో చిక్కకుండా తైవాన్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సొంతంగానే డ్రాగన్ను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలో భారత్ సహా
కీలక దశకు తైవాన్ సబ్మెరైన్ల నిర్మాణ ప్రాజెక్టు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: చైనా కబంధ హస్తాల్లో చిక్కకుండా, సొంతగానే డ్రాగన్ను ఎదుర్కొనేందుకు తైవాన్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భారత్ సహా పలు దేశాలు తైవాన్కు అండగా నిలిచినట్లు వార్తలొస్తున్నాయి. చైనాను తీవ్ర ఆందోళనకు గురిచేసే పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. తైవాన్ ఏకంగా సబ్మెరైన్ల నిర్మాణ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తోంది.
తాజాగా ఏం జరిగింది..?
నవంబరు మధ్యలో తైవాన్ సబ్మెరైన్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కీలక దశ దాటినందుకు ‘కీల్ లేయింగ్’ ఉత్సవాన్ని నిర్వహించింది. దీనికి మీడియాను ఆహ్వానించలేదు. కానీ, ఓ ఛానల్ ప్రసారం చేసిందంటూ తైవాన్ న్యూస్ పత్రిక ఈ కార్యక్రమం ఫొటోలతో సహా కథనాన్ని రాసింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు తైవాన్ కూడా పెద్దగా ప్రయత్నించలేదు. నవంబరు 30న తైవాన్లో అధికారిక డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సెక్రటరీ జనరల్ త్సాయి షిహ్ యంగ్ మాట్లాడుతూ.. ‘‘తైవాన్కు సహకరిస్తున్నందుకు ప్రపంచంలో సబ్మెరైన్లు తయారు చేసే ప్రధాన దేశాలకు థ్యాంక్స్. అవి ఎన్ని దేశాలన్నది ముఖ్యం కాదు. మా సబ్మెరైన్ల ప్రాజెక్టులో జోక్యానికి చైనా ప్రయత్నించదని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
తైవాన్ సబ్మెరైన్ ప్రాజెక్టుకు బ్రిటన్, అమెరికా, కెనడాల్లోని సంస్థలు సాయం చేస్తున్నట్లు ఓ ఆంగ్ల వార్త సంస్థ వెల్లడించింది. దీంతోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్, స్పెయిన్, కెనడా దేశాలకు చెందిన నావికాదళ మాజీ అధికారులు, టెక్నిషీయన్లను తైవాన్ నియమించకొన్నట్లు వెల్లడించింది.
ఏళ్లపాటు అడ్డంపడిన చైనా..!
తైవాన్ సొంతగా బలపడకుండా చైనా కొన్నేళ్లపాటు అడ్డుకొంది. మరోపక్క చైనా మాత్రం అడ్డగోలుగా నావిదళ బలాన్ని పెంచుకొంటోంది. దీంతో పట్టుదలగా ప్రయత్నించి తైవాన్ సొంతగా సబ్మెరైన్ల తయారీనే మొదలుపెట్టింది. తైవాన్ నావికాదళమైన ‘ది రిపబ్లిక్ ఆఫ్ చైనా నేవీ’ వద్ద ఇప్పటికీ చాలా పురాతన సబ్మెరైన్లు ఉన్నాయి. 1973లో అమెరికా తయారు చేసిన టెంచ్, బాలో క్లాస్ సబ్మెరైన్లు, 1987లో డచ్ తయారు చేసిన జ్వార్డివ్స్ సబ్మెరైన్లు రెండు మాత్రమే ఉన్నాయి. ఇక 1980ల్లో అమెరికా నుంచి టార్పిడోలు కొనుగోలుకు తైవాన్ యత్నించినా.. సాధ్యంకాలేదు. 1940ల్లో అమెరికా తయారు చేసిన మరో సబ్మెరైన్లు ఉన్నాయి. ఇవి చైనాతో యుద్ధంలో ఏమాత్రం ఉపయోగపడవు. వీటిని కేవలం శిక్షణకు మాత్రమే వాడుతున్నారు. 1980 నుంచే తైవాన్కు సబ్ మెరైన్లు అందకుండా చైనా తీవ్ర యత్నాలు మొదలుపెట్టింది.
తైవాన్కు సహనం నశించి..!
చైనా తీరుతో 2015లో తైవాన్కు సహనం నశించింది. దీంతో అమెరికా, జపాన్ దేశాల్లో కీలకమైన సబ్మెరైన్ టెక్నాలజీ సంస్థలతో తైవాన్ షిప్బిల్డింగ్ సంస్థ సీఎస్బీసీ ఒప్పందం చేసుకొంది. గతేడాది కొహ్సింగ్ సీఎస్బీసీ కర్మాగారం తైవాన్ కీలక నేతలు కలిసి సబ్మెరైన్ల తయారీని లాంఛనంగా ప్రారంభించారు. అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్ దీనికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే తొలి సబ్మెరైన్కు ‘కీల్ లేయింగ్’ ఉత్సవాన్ని గత నెల నిర్వహించారు. సబ్మెరైన్లో కీలక భాగాల తయారీ, పరీక్షలు విజయవంతమైతే వీటిని నిర్వహిస్తారు. కొత్త సబ్మెరైన్కు 1168 అనే నెంబర్ను కేటాయించారు. 2023 నాటికి ఈ సబ్మైరన్ను సముద్ర జలాల్లో పరీక్షించాలని నిర్ణయించింది. ఆ తర్వాత మరో ఏడు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అమెరికా కమాండోలు తైవాన్ దళాలకు శిక్షణ ఇస్తున్నాయి. ఇప్పుడు దీనికి తోడు సబ్మెరైన్ల తయారీకి అమెరికా, మిత్రదేశాలు సాయం చేస్తుండటం డ్రాగన్ను ఉకిరి బిక్కిరి చేస్తోంది. ‘కీల్ లేయింగ్’ ఉత్సవంపై చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ నవంబర్లోనే స్పందించింది. ‘తైవాన్ జలసంధి వద్ద బలాబలాల్లో ఉన్న తేడాలను మార్చలేము. చైనాతో పునరేకీకరణ బలప్రయోగంతో వ్యతిరేకిస్తే పరిస్థితి డెడ్ఎండ్కు చేరుతుంది’’ అని హెచ్చరించింది.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. -
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM