Omicron: మరిన్ని దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి.. బయటపడుతున్న కొత్త వేరియంట్ కేసులు
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ మరిన్ని దేశాలకు వ్యాపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బోట్స్వానా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్లో
ఇంటర్నెట్డెస్క్: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ మరిన్ని దేశాలకు వ్యాపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బోట్స్వానా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్లో ఈ రకం కేసులు వెలుగుచూడగా.. తాజాగా జర్మనీ, చెక్ రిపబ్లిక్ దేశాలకూ వ్యాపించింది. తమ దేశంలోకి ఇప్పటికే ఈ వేరియంట్ ప్రవేశించినట్లు జర్మనీ మంత్రి ఒకరు శనివారం ట్వీట్ చేశారు. అటు చెక్ రిపబ్లిక్ కూడా కొత్త వేరియంట్ అనుమానిత కేసు గుర్తించినట్లు ప్రకటించింది.
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ మ్యుటేషన్లను గుర్తించినట్లు జర్మనీ సామాజిక వ్యవహారాల శాఖమంత్రి కాయ్ క్లోస్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ వేరియంట్ ఇప్పటికే జర్మనీలోకి ప్రవేశించిందని అన్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఐసోలేషన్లో ఉంచామని, జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేగాక, గత రెండు వారాల్లో దక్షిణాఫ్రికా నుంచి దేశానికి వచ్చిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని ఐసోలేషన్లో ఉండాలని కోరారు.
కొత్త వేరియంట్ నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై జర్మనీ ఆంక్షలు విధించింది. దక్షిణాఫ్రికా నుంచి కేవలం జర్మనీ వాసులే తిరిగి స్వదేశానికి వచ్చేందుకు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. అలా వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే జర్మనీ సహా ఐరోపా దేశాల్లో కరోనా ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో తాజా వేరియంట్ మరింత భయాందోళనకు గురిచేస్తోంది. జర్మనీలో శనివారం ఒక్కరోజే 67వేలకు పైగా కొత్త కొవిడ్ కేసులు బయటపడ్డాయి.
మరోవైపు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు బయటపడుతున్నట్లు ఇప్పటికే నెదర్లాండ్స్ వెల్లడించింది. శుక్రవారం ఆ దేశం నుంచి రెండు విమానాలు రాగా.. అందులో 61 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు డచ్ అధికారులు తెలిపారు. అయితే వీరికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా కాదా అన్నది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్