UP: మథురలో కట్టుదిట్టమైన భద్రత
ఉత్తర్ ప్రదేశ్లోని పలు నగరాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నిన నేపథ్యంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను
మథుర: ఉత్తర్ ప్రదేశ్లోని పలు నగరాల్లో ఉగ్రదాడులకు ముష్కరులు కుట్ర పన్నిన నేపథ్యంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన అనంతరం లఖ్నవూ సహా పలు నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక నగరం మథురలో భద్రతను పెంచినట్టు పోలీసులు సోమవారం తెలిపారు. మథురలోని శ్రీకృష్ణ జన్మస్థానం, బృందావనంలోని ఠాకుర్ బంకె బిహారి దేవాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ వెల్లడించారు. ఠాకుర్ బంకె బిహారి దేవాలయం వద్ద భద్రతా ఏర్పాట్లను జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్జీ)కి చెందిన బృందం పర్యవేక్షించిందని చెప్పారు. చమురు శుద్ధి కర్మాగారాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యమునా ఎక్స్ప్రెస్ వే, ఆగ్రా-దిల్లీ జాతీయ రహదారి సహా బృందావనం, గోవర్థన్, బర్సానా లాంటి పట్టణాల్లో ప్రజల కదలికలపై ప్రత్యేక పోలీసు బృందాలు నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.
అల్ఖైదా అనుబంధ ఉగ్రముఠా అన్సర్ ఘజ్వతుల్ హింద్కు చెందిన ఇద్దరు ముష్కరులను యూపీ ఏటీఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రాష్ట్రంలోని లఖ్నవూ, మథుర, వారణాసి, అయోధ్య సహా పలు కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులకు వారు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్