కొత్త కరోనా: శాస్త్రీయ సమాచారమిదే!
ఇటీవల పొడచూపిన కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ (రకం) కంటే కూడా ప్రజల్లో వేగంగా వ్యాప్తిస్తున్న సందేహాలివి.
వాషింగ్టన్: చాలా సులభంగా, త్వరితంగా వ్యాప్తిస్తుందా?మరింత హాని చేస్తుందా?చికిత్సలకూ, వ్యాక్సిన్కూ లొంగదా? ఇటీవల పొడచూపిన కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ (రకం) కంటే కూడా ప్రజల్లో వేగంగా వ్యాప్తిస్తున్న సందేహాలివి. ప్రత్యేకించి ఇటీవల బ్రిటన్ తదితర విదేశాలకు వెళ్లి వచ్చినవారు, వారి సంబంధీకులు పలు అనుమానాలతో సతమతమౌతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు అందించిన శాస్త్రీయ సమాచారమిదే..
కొత్త కరోనా ఎక్కడ నుంచి వచ్చింది?
బ్రిటన్ కరోనా రకాన్ని తొలుత సెప్టెంబర్లో కనుగొన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా దక్షిణాఫ్రికాలో కూడా మరో రకం కొవిడ్ తలెత్తినట్టు తెలుస్తోంది. కొత్త పరివర్తనలు చోటుచేసుకోవటం అంటే స్వల్ప మార్పులకు గురికావటం వైరస్లలో సర్వ సాధారణం. సుమారు ఏడాది క్రితం చైనాలో వెల్లడైన నాటి నుంచి కొవిడ్-19 వైరస్లో అనేక వైవిధ్యాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు స్థలాలు, వ్యక్తులు, పరిస్థితులను బట్టి వాటిలో మార్పు వస్తూనే ఉంటుంది. ఐతే ఈ విధంగా వచ్చే మార్పులు చాలావరకు సామాన్యంగానే ఉంటాయి. వాటిని పూర్తి అక్షరమాలలో తొలుత వచ్చే అ,ఆ లతో పోల్చవచ్చని డాక్టర్ ఫిలిప్ లాండ్రిగన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త అంటారు. అయితే కరోనా తన ఉపరితలంపై ఉన్న ప్రొటీన్లు మార్పుచెంది.. ఔషధాలకు, టీకాలకు లొంగని విధంగా మారితే మాత్రం సమస్యాత్మకమే.
ఇది ఎప్పుడు ప్రమాదకరమవుతుంది?
సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు వంటి వాటి ద్వారా ఒక ప్రాంతంలో విపరీతంగా వ్యాప్తి చెందితే.. సమస్యాత్మకంగా మారే అవకాశముంది. పరివర్తనల వల్ల వైరస్కు మరింత వేగంగా వ్యాప్తి చెందే సామర్ధ్యం లభించడం వంటి అదనపు సామర్థ్యం చేకూరటం ప్రమాద కారకం కావచ్చు. కాగా..బ్రిటన్లో తలెత్తిన కొత్త కరోనాకు ఈ మాదిరి శక్తి ఉందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా, మిగిలిన కొవిడ్ మ్యుటేషన్స్తో పోలిస్తే దీనికి వేగంగా, ఎక్కువ మందికి సోకే శక్తి ఉందని డాక్టర్ లాండ్రిగన్ అంటున్నారు.
బ్రిటిష్ రకం కరోనాతో సమస్యేమిటి?
బ్రిటన్ కరోనా స్ట్రెయిన్లో సుమారు 24 రకాల పరివర్తనలు సంభవించాయి. వీటిలో ఎనిమిది.. మానవ కణాల్లో ప్రవేశించేందుకు ఉపకరించే అతి ముఖ్యమైన స్పైక్ ప్రొటీన్కు సంబంధించినవి. నిజానికి ఈ స్పైక్ ప్రొటీన్ను నిరోధించటమే లక్ష్యంగా వ్యాక్సిన్లు, యాంటీబాడీలతో కూడిన ఔషధాలను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండులో ఉన్న కరోనా, సాధారణ మహమ్మారి కంటే రెండు రెట్లు సోకే లక్షణాన్ని అధికంగా కలిగిఉందని డాక్టర్ రవి గుప్తా అనే వైరస్ నిపుణుడు తెలిపారు.
ఇది మరింత అనారోగ్యం, మరణాలకు దారితీస్తుందా?
నిజానికి ఈ విషయం ఇప్పటి వరకు రుజువు కాలేదు. అయితే ఆ విధమైన ప్రమాదం రాకుండా నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలి. కొత్త రకం కరోనా ఎక్కువమందికి వ్యాప్తిస్తున్న నేపథ్యంలో.. ఇది మరింత ప్రమాదకరమా అనేది త్వరలోనే తెలియనుంది. ఐతే దీనివల్ల అనారోగ్యంలో కానీ, వ్యాధి తీవ్రతలో కానీ మార్పులేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య నిపుణురాలు మారియా వాన్ కెర్ఖోవే వెల్లడించారు.
చికిత్సపై పరివర్తనల ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం వాడుతున్న ఔషధాలు శరీరానికి యాంటీబాడీలను అందించటం ద్వారా వైరస్పై పనిచేస్తాయి. ఇంగ్లాండులో బయటపడిన అనేక కేసుల్లో.. రెండింటిలో చోటుచేసుకున్న పరివర్తనలు.. కరోనా ఔషధాల సామర్ధ్యం విషయమై సందేహాలను రేకెత్తిస్తున్నాయి. కాగా, కొత్తరకంపై యాంటీబాడీల స్పందనను గురించి విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి.
వ్యాక్సిన్లపై ప్రభావం సంగతేంటి?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కొత్త కరోనాపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కేవలం యాంటీబాడీలు తయారయ్యేందుకు దోహదం చేయటమే కాకుండా.. రోగనిరోధక శక్తి విస్తృతంగా స్పందించేలా ప్రేరేపించటం వ్యాక్సిన్ల లక్షణం. ఈ కారణం వల్లనే అవి కొత్త రకం కరోనాపై కూడా ప్రభావం చూపుతాయని పలువురు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని నిర్ధారించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త కరోనా రకం, తాము వాడుతున్న వ్యాక్సిన్లపై ప్రభావం చూపటం లేదని బ్రిటన్ అధికారులు స్పష్టం చేశారు.
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
సాధారణ కరోనా కట్టడికి ప్రజారోగ్య నిపుణులు సూచించే.. మాస్క్ ధరించటం, చేతులను తరచు శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరం పాటించటం, జన సమూహాల్లోకి వీలైనంత వరకు వెళ్లకపోవటం తదితర మార్గదర్శకాలనే కొత్త కరోనా విషయంలోనూ పాటించాలి.
ఇవీ చదవండి..
మరోసారి బయటపడ్డ చైనా కుయుక్తులు!
కరోనా 2.0తో మనకు మళ్లీ భయం తప్పదా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత