ట్విటర్పై రష్యా ఆంక్షలు..!
సామాజిక మాధ్యమం ట్విటర్పై రష్యా కూడా ఆంక్షలు మొదలుపెట్టింది. ఫోటోలు, వీడియోలను ట్విటర్లో అప్లోడ్ చేయడంలో స్పీడ్ తగ్గించింది.
దేశ చట్టాలకు అనుగుణంగానే పనిచేయాలని స్పష్టం
మాస్కో: సామాజిక మాధ్యమం ట్విటర్పై రష్యా కూడా ఆంక్షలు మొదలుపెట్టింది. ఫోటోలు, వీడియోలను ట్విటర్లో అప్లోడ్ చేయడంలో స్పీడ్ తగ్గించింది. నిషేధిత కంటెంట్ను తొలగించడంలో విఫలమైనందుకు ఈ ఆంక్షలు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. పిల్లలలో ఆత్మహత్యలను ప్రేరేపించడం, డ్రగ్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నిషేధిత సమాచారాన్ని తొలగించడంలో ట్విటర్ విఫలమైందని రష్యా సమాచార నియంత్రణ సంస్థ రోస్కోమ్నాడ్జోర్ వెల్లడించింది. దీనిపై ట్విటర్ సరైన రీతిలో స్పందిస్తుందనే నమ్మకం ఉందని..అయితే, రష్యా చట్టాలను అమలు చేయకపోతే పూర్తిగా నిషేధిస్తామని హెచ్చరించింది.
ట్విటర్పై ఆంక్షలు విధించే అంశంపై రష్యా అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి దిమిత్రియ్ పెస్కోవ్ స్పందించారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించాలనే కోరిక తమ ప్రభుత్వానికి లేదని, కానీ, చట్టానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంచేశారు.
ఆంక్షలు అందుకేనా..?
ట్విటర్పై రష్యా ఆంక్షలు విధించడానికి ఇతర కారణాలు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రష్యా ప్రతిపక్ష నాయుకుడు అలెక్సీ నావెల్నీని ప్రభుత్వం అరెస్టు చేయడంతో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన్ను విడుదల చేయాలంటూ దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను ఏకతాటిపై తీసుకురావడంలో ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలే కీలకంగా వ్యవహరించాయని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నిరసనల్లో పాల్గొనాలని పిల్లలకు పిలుపునివ్వడం వంటి చర్యలను అక్కడి ప్రభుత్వం తప్పుబడుతోంది. రష్యా చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న ఇటువంటి సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు తొలగించాలని రష్యా ప్రభుత్వం పేర్కొంది. ఇలా కంటెంట్ విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ట్విటర్ పట్టించుకోకపోవడంతోనే ఈ ఆంక్షలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని