Rocket attack: అమెరికా స్థావరంపై రాకెట్‌ దాడి

ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్లు విరుచుకుపడ్డాయి. బుధవారం ఇరాక్ రాజధాని

Published : 09 Jul 2021 01:26 IST

బాగ్దాద్‌: ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్లు విరుచుకుపడ్డాయి. బుధవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో రాకెట్ దాడులు జరిగాయి. మూడు రాకెట్లతో ఈ దాడి చేసినట్లు ఇరాక్ సైన్యం పేర్కొంది. రాయబార కార్యాలయానికి ఎలాంటి నష్టం జరగలేదని, దాడి జరిగిన ప్రదేశం ధ్వంసమైందని వెల్లడించింది. కాగా బుధవారం ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్, డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడులను ఇరాన్ మద్దతుదారులు చేశారని అమెరికా ఆరోపించింది.  ఆ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే రాయబార కార్యాలయానికి సమీపంలో ఈ దాడి జరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని