రైతులతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమే: తోమర్‌

సాగు చట్టాలపై నిరసనలు కొనసాగిస్తున్న రైతులతో ఇప్పటికే 12 విడతలుగా చర్చలు జరిపినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌.....

Updated : 25 Feb 2021 18:42 IST

దిల్లీ: సాగు చట్టాలపై నిరసనలు కొనసాగిస్తున్న రైతులతో ఇప్పటికే 12 విడతలుగా చర్చలు జరిపినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. రైతు సంఘాల నేతలతో చర్చలకు కేంద్రం ఎప్పుడైనా సిద్ధమేనని ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, అందువల్ల ఈ చట్టాలను అమలు చేయలేమన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దిల్లీ సరిహద్దుల్లో దాదాపు మూడు నెలలుగా కర్షకులు నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వారి నిరసనలకు గురువారం బీఎస్పీ జాతీయ అధికారప్రతినిధి సుధీంద్ర భదోరియా మద్దతు తెలిపారు. రైతుల డిమాండ్లపై కేంద్రం ఇంకా ఆలస్యం చేయరాదని సూచించారు. మరోవైపు, వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య 12 విడతలుగా చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం రాలేదు. కేంద్రం దిగిరాకపోవడం, రైతులు పట్టువీడకపోవడంతో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని