Drone attack: అరే.. పాక్ దొరికేసింది అలా..!
జమ్ములో జరిగిన డ్రోన్ దాడి వెనుకాల పాక్ పాత్ర ఉన్నట్లు బలపర్చే ఆధారాలు బయటపడ్డాయి. వీటిని కప్పిపెట్టుకోవడానికి పాక్ కొత్త డ్రామకు తెరతీసింది. తమ అభిమాన లష్కరే నేత హఫీజ్ సయిద్పై జూన్ 23 జరిగిన దాడిలో
ఆర్డీఎక్స్ను గుర్తించిన దర్యాప్తు బృందాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
జమ్ములో జరిగిన డ్రోన్ దాడి వెనుక పాక్ పాత్ర ఉన్నట్లు బలపర్చే ఆధారాలు బయటపడ్డాయి. వీటిని కప్పిపుచ్చుకోవడానికి పాక్ కొత్త డ్రామాను రక్తికట్టిస్తోంది. తమ అభిమాన లష్కరే నేత హఫీజ్ సయీద్పై జూన్ 23న జరిగిన దాడిలో భారత్ హస్తం ఉందంటూ ఆరోపణలు మొదలుపెట్టింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ మరో రెండడుగులు ముందుకేసి.. భారత్ ఉగ్రవాదులకు నిధులు అందిస్తోందని.. ఎఫ్ఏటీఎఫ్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. ఇదంతా భారత వాయుసేన స్థావరంపై జరిగిన దాడి నుంచి ప్రపంచ దేశాల దృష్టి మళ్లించే వ్యూహంలా కనిపిస్తోంది.
దాడికి చైనా డ్రోన్.. పాక్ ఆర్డీఎక్స్..?
జమ్ము దాడికి వాడిన పేలుడు పదార్థాల మిశ్రమాల్లో ఆర్డీఎక్స్, నైట్రేట్ ఉన్నట్లు ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలల్లో గుర్తించారు. భారత్లో ఆర్డీఎక్స్ ఎక్కడా లభించదు. దీనిని పాకిస్థాన్ నుంచి తెప్పించాల్సిందే. ఈ ఒక్క పదార్థమే పాక్ పాత్రను తెలియజేస్తోంది. ఈ దాడికి చైనాలో తయారైన జీపీఎస్ డ్రోన్ వాడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాడికి వాడిన రెండు బాంబుల్లో ఒకటి పెద్దదిగా ఉంది. దీనిని వైమానిక స్థావరాల్లో కట్టడాలను ధ్వంసం చేయడానికి సిద్ధం చేసినట్లు భావిస్తున్నారు. ఇక రెండో బాంబు మనుషులను లక్ష్యంగా చేసుకొని తయారు చేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే తొలి పేలుడు తర్వాత అక్కడికి వచ్చేవారు మరణించాలనే లక్ష్యంతో దానిలో ఎక్కువగా బాల్బేరింగ్ గుండ్లు, మేకులు వంటివి ఉంచారు. ఈ ఆధారాలన్నీ లష్కరే తొయిబా పాత్రను చెప్పకనే చెబుతున్నాయి. ఎందుకంటే పాక్ సైన్యంలో అప్రకటిత భాగంగా ఆ సంస్థకు పేరుంది. అందుకే సైన్యం ఈ స్థాయి పేలుడు పదార్థాలు, ఆయుధాలను దానికి సమకూరుస్తోంది. జమ్ముకశ్మీర్ డీజీపీ దల్బీర్ సింగ్ కూడా లష్కరే వైపే వేలెత్తి చూపారు.
గల్వాన్ హడావుడిలో ఉండగా.. డ్రోన్ల శక్తి పెంచుకొని..
గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా సరిహద్దుల్లో బలగాల మోహరింపు, ఆయుధాలు సమకూర్చుకొనే హడావుడిలో భారత్ ఉండగా.. మరోవైపు పాక్ మాత్రం డ్రోన్ల శక్తిని పెంచుకోవడం మొదలుపెట్టినట్లు సమాచారం. టర్కీ, చైనా నుంచి భారీ ఎత్తున చిన్నసైజు మానవరహిత విమానాలు కొనుగోలు చేసినట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. పాక్ సైన్యం ‘సూపర్కామ్ 250’ అనే మానవ రహిత విమానంతో నిఘా, సమాచార సేకరణ అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జూన్ 24వ తేదీన నెస్కామ్ బుర్రాక్ మానవ రహిత విమానంతో ఒక లేజర్ గైడెడ్ క్షిపణిని ప్రయోగించి పరీక్షించింది. పలు రక్షణ, శాస్త్ర సాంకేతిక విభాగాలు ఈ పరీక్షల్లో పాల్గొన్నాయి.
ఈ ఏడాది మే 31 - జూన్11 మధ్యలో పాక్ వ్యూహాత్మక ప్రణాళిక విభాగం, ఇన్స్పెక్షన్ టెక్నాలజీ డెవలప్మెంట్ విభాగం సభ్యులు టర్కీకి వెళ్లివచ్చారు. వీరు అక్కడ ఎం.ఎస్. బేరక్తర్ కుటుంబానికి చెందిన డ్రోన్ల ఫ్యాక్టరీని సందర్శించారు. అనంతరం బేరక్తర్ వీటీ ఓఎల్, టీబీ2 రకం డ్రోన్లను పాక్లోనే తయారు చేసే అంశంపై చర్చించారు. ఆ తర్వాత జర్మనీకి చెందిన ఆర్టోస్ డ్రోన్ రక్షణ వ్యవస్థ కొనుగోలుకు పాక్ డ్రోన్ రెగ్యులేటరీ అథారిటీ చర్యలు చేపట్టింది. జామింగ్ సామర్థ్యం ఉన్న ఈ వ్యవస్థ డ్రోన్ల రాకపోకలను గమనిస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్ త్రివిధ దళాల సభ్యులు, ఇతరశాఖల బృందాలు చైనాలోని నోర్నికో ఫ్యాక్టరీ సందర్శనకు వెళ్లాయి. ఇక్కడ గగనతల యుద్ధాలకు అవసరమైన ఆయుధాలను తయారు చేస్తారు. వీటిల్లో డ్రోన్లు కూడా ఉన్నాయి.
భారత్పైనే ఆరోపణలు..
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ ఆరోపించారు. పాకిస్థాన్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న భారత్ విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు. లాహోర్లోని జోహార్ టౌన్లో లష్కరే తొయిబా నేత హఫీజ్ సయీద్పై దాడికి న్యూదిల్లీనే నిధులు సమకూర్చిందని ఆరోపించారు. పాక్లో శాంతిభద్రతలకు భారత్ భంగం కలిగిస్తోందన్నారు. పాకిస్థాన్ మరోసారి భారత్ ఉగ్రకార్యకలాపాలపై గొంతు విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. కానీ, అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్ వాదనను తేలిగ్గా తీసుకుంటోందని వాపోయారు.
హఫీజ్ సయీద్కు, మరో ఉగ్రవాది జకీర్ ఉర్ రెహ్మాన్కు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇటీవల రెహ్మాన్ తన ముఠా సభ్యులను పాక్ ఆక్రమిత కశ్మీర్కు తరలించారు. ఆ తర్వాత ఈ దాడి చోటు చేసుకొంది. ఈ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ఈద్గుల్ అనే వ్యక్తి అఫ్గాన్ జాతీయుడని పాక్ జాతీయ భద్రతా సలహాదారు యూసఫ్ పేర్కొన్నారు. వాస్తవానికి భారత్లో కూరగాయల మార్కెట్ల వలే పాకిస్థాన్లో ఆయుధ మార్కెట్లు ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. 30 కిలోల పేలుడు పదార్థాలు, కారు సంపాదించడం అక్కడ అత్యంత తేలికైన పని. పరస్పర దాడులు ఉగ్రసంస్థలకు అక్కడ సర్వసాధారణమే. ఇన్ని ఆరోపణలు చేసిన పాకిస్థాన్ ఎటువంటి ఆధారాలను మాత్రం చూపలేదు. లోతైన దర్యాప్తు చేస్తామని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!