Mayawati: మాయావతి ఇంట విషాదం.. ప్రియాంక గాంధీ పరామర్శ

బీఎస్పీ అధినేత్రి, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం మాయావతికి మాతృవియోగం కలిగింది. ఆమె తల్లి రామ్‌రతి(92) హార్ట్‌ ఫెయిల్యూర్‌తో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. రాష్ట్ర ఎన్నికల ప్రచార సన్నాహాల్లో ఉన్న మాయావతి.. ఈ మేరకు...

Published : 14 Nov 2021 16:15 IST

దిల్లీ: బీఎస్పీ అధినేత్రి, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం మాయావతికి మాతృవియోగం కలిగింది. ఆమె తల్లి రామ్‌రతి(92) హార్ట్‌ ఫెయిల్యూర్‌తో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. రాష్ట్ర ఎన్నికల ప్రచార సన్నాహాల్లో ఉన్న మాయావతి.. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే దిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఏడాది క్రితమే తండ్రి ప్రభుదయాళ్‌ తుదిశ్వాస విడవగా.. ఇప్పుడు తల్లి కన్నుమూయడంతో మాయావతి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. నేడు దిల్లీలో రామ్‌రతి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆయా పార్టీల నేతల సంతాపం..

మరోవైపు బీఎస్పీ సహా ఆయా పార్టీల నేతలు మాయావతి తల్లి మరణంపై సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఆదివారం మాయావతిని దిల్లీలోని ఆమె నివాసంలో కలిసి, పరామర్శించారు. రామ్‌రతి భౌతికకాయానికి నివాళులర్పించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తదితర ప్రముఖులూ సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపం ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు