కరోనాతో జాగ్రత్త.. మహమ్మారిపై పోరాటం ఆపొద్దు: రాష్ట్రపతి
భారత ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన తరుణమిదేనని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. దేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ.....
దిల్లీ: భారత ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన తరుణమిదేనని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. దేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. బుధవారం రిపబ్లిక్డే వేడుకల సందర్భంగా ఈరోజు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్ వంటి అదృశ్య శక్తితో పోరాటం కొనసాగించాలనీ.. ఈ మహమ్మారి కట్టడికి మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కొవిడ్పై పోరులో దేశం అసాధారణ ప్రతిభ ప్రదర్శిస్తోందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇతర దేశాలకు సైతం భారత్ సాయం చేసిందని పేర్కొన్నారు. కరోనాకు రెండు టీకాలు రూపొందించడం గర్వకారణమన్నారు. మన దేశంలో తయారైన టీకాలను ఇతర దేశాలకూ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రస్తావించారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం ద్వారా కొవిడ్ వ్యాప్తిని నిరోధించాలన్నారు. కరోనా సమయంలోనూ దేశ ప్రజలు పోరాట స్ఫూర్తి చాటారన్నారు. వైద్య రంగ నిపుణులు, సిబ్బంది ప్రశంసనీయ సేవలందించారన్నారు.
ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత గణతంత్రానికి పునాదులుగా నిలుస్తాయని రాష్ట్రపతి అన్నారు. కరోనా వైరస్పై నిరుపమాన దృఢ సంకల్పాన్ని చాటామని చెప్పేందుకు తాను గర్వపడుతున్నానన్నారు. కరోనా పట్ల ఇంకా అప్రమత్తంగా ఉండాలనీ.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. తమ ప్రాణాలకు అపాయమని తెలిసినా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఈ సవాల్ని ఎదుర్కొనేందుకు పని గంటలతో నిమిత్తం లేకుండా కష్టసమయంలో సేవలందించారని కొనియాడారు. కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని.. కరోనా సమయంలోనూ సాగు, తయారీ రంగంలో ప్రగతి సాధించామన్నారు. సురక్షితమైన డిజిటల్ చెల్లింపు సదుపాయాలు మెరుగయ్యాయని తెలిపారు. యువ మానవ వనరులు ఉండటం దేశానికి అనుకూలమైన అంశమని రాష్ట్రపతి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి