భారత్-పాక్ నిర్ణయాన్ని ప్రశంసించిన ఐరాస
సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటించేందుకు భారత్-పాక్ మధ్య కుదిరిన అంగీకారాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని ఐరాస అధినాయకత్వం స్వాగతిస్తున్నట్లు పేర్కొంది....
ఇంటర్నెట్ డెస్క్: సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటించేందుకు భారత్-పాక్ మధ్య కుదిరిన అంగీకారాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని ఐరాస అధినాయకత్వం స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. కాల్పుల విరమణపై భారత్, పాక్ సైన్యం చేసిన సంయుక్త ప్రకటన కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంత వాతావరణానికి దోహదం చేస్తుందని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డొజారిక్ తెలిపారు. ఇరు దేశాల తదుపరి చర్చలకు ఇదొక సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్-పాక్ మధ్య కుదిరిన అంగీకారాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి 75వ సెషన్ అధ్యక్షుడు వొల్కాన్ బోజ్కిర్ వెల్లడించారు. ప్రధాన సమస్యలు, ఆందోళనలను పరిష్కరించడం ద్వారా సుస్థిర శాంతిని సాధించవచ్చని చెప్పేందుకు ఇది ఉదాహరణగా నిలుస్తుందని ట్విటర్లో పేర్కొన్నారు. గురువారం భారత్, పాక్ డైరెక్టర్ జనరళ్ల స్థాయి సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్పనిసరిగా పాటించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని