కరోనా దెబ్బకు.. ఆ దేశాల మంత్రులు రాజీనామా!
కరోనా వైరస్ కట్టడిలో విఫలమైన ఆరోపణలతో కొన్ని దేశాల ఆరోగ్యశాఖ మంత్రులు వారి పదవులకు రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడింది.
వైరస్ కట్టడిలో విఫలమైనందుకు బాధ్యులుగా..
ఇంటర్నెట్ డెస్క్: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆయా దేశాలు శ్రమిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాల్లో వైరస్ ఉద్ధృతిని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోలేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడిలో విఫలమైన ఆరోపణలతో కొన్ని దేశాల ఆరోగ్యశాఖ మంత్రులు వారి పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్రెజిల్లో నలుగురు..
వైరస్ కట్టడికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బ్రిజిల్లో భారీ సంఖ్యలో పౌరులు రోడ్లమీదకు వచ్చి ప్రధాని బొల్సొనారోకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ నాలుగు సార్లు ఆరోగ్యశాఖ మంత్రిని మార్చాల్సి వచ్చింది. బ్రెజిల్లోనే కాకుండా మరికొన్ని దేశాల్లోనూ కరోనా నియంత్రణలో అక్కడి ఆరోగ్యశాఖ మంత్రులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో వారి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వీరే కాకుండా స్కాట్ల్యాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాల్లో కొవిడ్ నిబంధనలు అతిక్రమించినందుకు కీలక పదవుల్లో ఉన్న నాయకులకు ఉద్వాసన పలకాల్సి వచ్చింది.
అర్జెంటీనా..
కరోనా వైరస్ ధాటికి దక్షిణ అమెరికా దేశాలు వణికిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్జెంటీనాలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 38లక్షల పాజిటివ్ కేసులు రికార్డు కాగా 78 వేల మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అవకతవకలు జరిగినట్లు తేలింది. క్యూలో నిలబడకుండా కొందరు రాజకీయ పలుకుబడి ఉపయోగించారనే వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి గైన్స్ గొంజాలెజ్ గర్సియా తన పదవిని వీడుతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు.
జోర్డాన్..
కరోనా కరోనా తీవ్రత కొనసాగుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల కొవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో చాలా ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా జోర్డాన్లోని ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై ప్రధానమంత్రి బిషెర్ ఆల్ ఖాసవ్నేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి నాజిర్ ఒబియదత్ ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ 7లక్షల కేసులు నమోదుకాగా 9వేల మంది కొవిడ్ బాధితులు కన్నుమూశారు.
పెరూ..
కరోనా వైరస్ ఉద్ధృతికి పెరూ దేశం వణికిపోయింది. అక్కడ 19 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై వివాదం మొదలయ్యింది. ఆ దేశంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రాకముందే పెరూ మాజీ అధ్యక్షుడు మార్టిన్ విజ్కర్రా టీకా తీసుకున్నారని తేలింది. దీన్ని వ్యాక్సిన్ స్కాండల్గా పేర్కొంటూ స్థానిక మీడియా ప్రసారం చేయడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలయ్యింది. దీంతో పెరూ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ పిలార్ మజెట్టీ తన పదవికి రాజీనామా చేశారు.
ఇరాక్..
కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఇరాక్లోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ ట్యాంకు పేలిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణలో తేలింది. ఇందుకు బాధ్యత వహిస్తూ ఇరాక్ ఆరోగ్యశాఖ మంత్రి హస్సన్ ఆన్-తమీమీ తన పదవికి రాజీనామా చేశారు. ఇక ఇరాక్లో ఇప్పటివరకు 12లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 16వేల కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.
ఆస్ట్రియా..
కరోనా కట్డడికి కృషి చేసిన ఆస్ట్రియా ఆరోగ్యశాఖ మంత్రి రుడోల్ఫ్ ఆన్షోబెర్ కూడా ఏప్రిల్ 13న తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కరోనా విజృంభణ సమయంలో అధిక సమయం పనిచేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి మరో దక్షత కలిగిన నాయకుడు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని తన వైద్యులు కూడా సూచించినట్లు రుడోల్ఫ్ తెలిపారు. ఆస్ట్రియాలో ఇప్పటివరకు 6లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మరణాల సంఖ్య 10వేలు దాటింది.
ఈక్వెడార్..
కరోనా కట్టడి, వ్యాక్సిన్ పంపిణీ వ్యవహారంలో సరిగా స్పందించని కారణంగా ఈక్వెడార్ ఆరోగ్యశాఖ మంత్రి రొడొల్ఫో ఫార్ఫాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పదవీ బాధ్యతలు చేపట్టిన కేవలం నెల రోజుల్లోనే ఆయన ఆరోగ్యశాఖకు రాజీనామా చేశారు. ముఖ్యంగా వ్యాక్సిన్ సరఫరాలో తన సన్నిహితులకు సహాయం చేసినట్లు ఆరోపణలు రావడంతో రొడొల్ఫో తన పదవికి రాజీనామా చేశారు. ఈక్వెడార్లో ఇప్పటివరకు 4లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా 20వేల మంది మృత్యువాతపడ్డారు.
మంగోలియా..
కరోనా వైరస్ సోకిన ఓ మహిళతో పాటు చిన్నారికి చికిత్స చేసే విషయంలో ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలతో మంగోలియాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దారితీసింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటనతో కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ఘటనకు తాను బాధ్యత వహించాల్సి ఉంటుందని.. అందుచేత కేబినెట్ మొత్తం రద్దు చేస్తున్నట్లు మంగోలియన్ ప్రధానమంత్రి ఖురేల్సుఖ్ ఉఖ్నా ప్రకటించారు. అప్పుడే జన్మనిచ్చిన తల్లిని మరోచోటుకి తరలించడంలో తప్పు జరిగిందని ప్రధాని అంగీకరించారు.
స్లొవాకియా..
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో స్లొవాకియా ప్రభుత్వం విఫలమయ్యిందని అక్కడి విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా వైరస్ కట్టడితోపాటు రష్యా వ్యాక్సిన్ సుత్నిక్-వి విషయంలోనూ ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇలా కరోనా నియంత్రణలో విఫలం కావడంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఈ ఏడాది మార్చి నెలలో స్లొవాకియా ఆరోగ్యశాఖ మంత్రి మారెక్ క్రాజి తన పదవికి రాజీనామా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించడంపై ఆప్ స్పందించింది. ఆయనను చంపేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
లోక్సభ ఎన్నికల తొలి దశకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 సీట్లకు శుక్రవారం (ఏప్రిల్ 19న) పోలింగ్ నిర్వహించనున్నారు. -
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
ద్రవిడనాట పట్టు బిగించాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విస్తృత పర్యటన చేశారు. -
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
Dubai Rains: దుబాయ్లో చిక్కుకున్న భారతీయుల కోసం అక్కడి మన దౌత్య కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసింది. -
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్