Chhath puja: అర్చకులు లేకుండా పూజ.. ఛఠ్ పండగ ప్రత్యేకత ఇదే!
సంప్రదాయం, పండుగలకు పెట్టింది పేరు మన భారతదేశం. మనం జరుపుకొనే ప్రతీ పండుగ వెనుక పురాణాలకు సంబంధించిన ఒక కథ లేదా ఓ సందర్భమనేది తప్పక ఉంటుంది. ప్రకృతితో మమేకమై జరుపుకొనే ‘ఛఠ్ పండుగ’
‘ఛఠ్ పూజ’ విశిష్టతను తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ
ఇంటర్నెట్ డెస్క్: పండుగలకు పెట్టింది పేరు మన భారతదేశం. మనం జరుపుకొనే ప్రతి పండుగ వెనుకా పురాణాలకు సంబంధించిన ఒక కథ లేదా ఓ సందర్భమనేది తప్పక ఉంటుంది. ఆ కోవకు చెందినదే ఛఠ్ పండుగ. ప్రకృతితో మమేకమై జరుపుకొనే పండగ ఇది. ఛట్ పండుగ సందర్భంగా అసలేమిటీ పండుగ? ఎందుకు జరుపుకొంటారు? దీని ప్రాముఖ్యం ఏంటో తెలుసుకుందాం..
దీపావళి పండుగ పూర్తయిన ఆరు రోజుల తర్వాత జరుపుకొనేదే మహాపర్వ్ ‘ఛఠ్ పూజ’. ఏటా కార్తిక మాసం శుక్లపక్షంలోని షష్ఠి సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ పూజలు చేస్తారు. సాధారణంగా పూజలు చేస్తున్నప్పుడు అర్చకులు ఉంటారు. ఇందులో అర్చకులే లేకుండా పూజలు నిర్వహించడం ఓ విశేషం. బిహార్, ఝార్ఖండ్ సహా ఉత్తర భారత దేశంలో ‘ఛఠ్ పూజ’ను నిర్వహిస్తారు. రోజు తినే ఆహారం నుంచి ధరించే వస్త్రాల వరకూ ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటాయి. ఉదయించే సూర్య భగవానుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగలో.. 36 గంటల పాటు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తారట. సూర్యభగవానుడిని కొలిచే ఏకైక పూజ ఇదేనని అక్కడి వారి విశ్వాసం. దీనికే సూర్యశస్తిల్, దళాఛఠ్ అని కూడా పేర్లున్నాయాయి. దీపావళి మాదిరిగానే ఈ పూజ సమయంలో దీపాలు వెలిగిస్తారు. నదీ ఘాట్ల వద్ద పండ్లతో అలంకరించి ఛఠ్మాతకు పూజలు చేస్తారు. అనంతరం పండ్లను పంచిపెడతారు. ఈ ఏడాది నవంబర్ 8న ప్రారంభమైన ఈ పూజ 11తో ముగియనుంది. సూర్యుడు, నీరే ఈ పూజలో కీలకం. ప్రార్థనల్లో వెదురు, మట్టిని ఎక్కువ ఉపయోగిస్తారు. ఇక ప్రసాదాల్లో చెరకు ప్రధానంగా కనిపిస్తుంది. మహా పర్వ సందర్భంగా చెరకు గడలతో ఇల్లు మాదిరిగా నిర్మించి అందులో ఏనుగు ప్రతిమను ఉంచి పూజలు చేస్తారు.
మోదీ శుభాకాంక్షలు
ఛఠ్ పూజ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ విశిష్టత గురించి ‘మన్కీ బాత్’లో మాట్లాడిన ఆడియోను ట్విటర్లో ఉంచారు. ప్రకృతితో ఈ పండుగ ముడిపడి ఉందని మోదీ చెప్పారు. సాధారణంగా ప్రపంచమంతా ఉదయించే సూర్యుడినే ఆరాధిస్తుందని, అస్తమించే సూర్యుడిని ఆరాధించడంలోనూ గొప్పదనం, గౌరవం ఉందనేది ఈ ఛఠ్ పూజ ద్వారా తెలుస్తుందని మోదీ అన్నారు. సాధారణంగా ప్రజలు వేరేవాళ్ల నుంచి ఏదైనా అడగాలంటే సంకోచిస్తారని, ఛఠ్ పూజ రోజు పక్కన వారి నుంచి ప్రసాదం అడిగి తీసుకునే సంప్రదాయం ఉంటుందని తెలిపారు. మనలోని అహంకారాన్ని చంపడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ప్రతి భారతీయుడూ ఇలాంటి సంప్రదాయం పట్ల గర్వపడాలి మోదీ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం