Omicron: ఒమిక్రాన్ బాధితుల్లో స్వల్ప లక్షణాలు..!
సార్స్కోవ్-2 కొత్త మ్యూటేషన్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ సోకిన రోగుల్లో స్వల్పలక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని.. వారికి ఇంటి వద్దనే ఉంచి చికిత్సను అందించవచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన ఒక డాక్టర్ వెల్లడించారు.
వెల్లడించిన దక్షిణాఫ్రికా డాక్టర్
ఇంటర్నెట్డెస్క్: సార్స్కోవ్-2 కొత్త మ్యూటేషన్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ సోకిన రోగుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని.. వారిని ఇంటి వద్దే ఉంచి చికిత్స అందించొచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన ఒక డాక్టర్ వెల్లడించారు. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ ఓ ఆంగ్ల వార్తా సంస్థ వద్ద ఈ విషయాన్ని వెల్లడించారు. కోయెట్జీ దక్షిణాఫ్రికా వ్యాక్సిన్ కమిటీలో సభ్యురాలు కూడా. కొత్త వేరియంట్ను తొలిదశలో అనుమానించిన వారిలో ఆమె కూడా ఒకరు. డెల్టా వేరియంట్ కంటే భిన్నమైన లక్షణాలతో ఏడుగురు పేషెంట్లు వచ్చినట్లు వెల్లడించారు. వీరిందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. ఈ ఘటన నవంబర్ 18న జరిగినట్లు వివరించారు. నవంబర్ 25న దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్ఐసీడీ) సంస్థ ఒమిక్రాన్ వేరియంట్ వివరాలను వెల్లడించింది.
ఈ విషయమై కోయెట్జీ మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన పేషెంట్లు తీవ్రమైన ఒళ్లునొప్పులు, తలనొప్పితో రెండ్రోజులు బాధపడ్డారని పేర్కొన్నారు. ‘‘ఆ సమయంలో వారి లక్షణాలు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలను పోలి ఉన్నాయి. అప్పటికి 10 వారాల వరకు మా ప్రాంతంలో కొవిడ్ కేసులు రాలేదు. దీంతో వారికి పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. ఆ పేషెంట్, వారి కుటుంబ సభ్యులకూ వైరస్ సోకింది. అదే రోజు అటువంటి లక్షణాలతో మరికొంత మంది పేషెంట్లు వచ్చారు. ఏదో మార్పు వచ్చినట్లు అనుమానించాను. ఆ తర్వాత ఎన్ఐసీడీని అదే రోజు అప్రమత్తం చేశాను. ఆ తర్వాత నిత్యం ఇద్దరు లేదా ముగ్గురు కొవిడ్ పేషెంట్లు నా క్లినిక్కు రావడం మొదలైంది. వారందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. ఆ పేషెంట్లను ఇంటి వద్ద ఉంచే చికిత్స అందించాం. వాసన, రుచి పోవడం, ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించలేదు’’ అని పేర్కొన్నారు.
పీసీఆర్ పరీక్షల్లో గుర్తించవచ్చు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా కొత్త వేరియంట్ను గుర్తించే అంశంపై ఆదివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది. దీనిని కూడా ఇతర వేరియంట్ల వలే పీసీఆర్ పరీక్షల్లో గుర్తించవచ్చని వెల్లడించింది. ఇతర పరీక్షల ఫలితాలను ఒమిక్రాన్ వేరియంట్ ఏమేరకు ప్రభావితం చేస్తోందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ వేరియంట్ వ్యాప్తి వేగం ఏ స్థాయిలో ఉందనే అంశంపై , రోగ లక్షణాల తీవ్రతపై పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు మిగిలిన వాటికంటే ఎంత భిన్నంగా ఉంటాయో కూడా చెప్పేందుకు తగినంత సమాచారం లేదని పేర్కొంది. కాకపోతే గతంలో కొవిడ్ బారినపడిన వారు కూడా మరోసారి ఒమిక్రాన్ బారిన పడేందుకు అవకాశం ఉందనటానికి ఆధారాలు లభించాయని వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ఒమిక్రాన్ వేరియంట్ను ‘ఆందోళనకర వేరియంట్’గా ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు వెలుగు చూసినా ఆల్ఫా,బీటా,గామా వేరియంట్లకంటే ప్రమాదకరమైన జాబితాలోకి చేరింది. ఈ జాబితాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ మాత్రమే ఉంది. ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. కాలంతో పోటీపడి దీనిని అడ్డుకోవాలని ఐరోపా సమాఖ్య చీఫ్ వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!