హోంమంత్రిపై ఆరోపణల కేసులో కీలక మలుపు!

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఆరోపణ చేసిన ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌, తనను హోంగార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Updated : 22 Mar 2021 15:50 IST

సుప్రీంకోర్టులో పరమ్‌వీర్‌ పిటిషన్‌
నిస్పాక్షిక దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి

ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు చేసిన ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్ నేడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనను హోంగార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ వేశారు. దీనిపై స్టే విధించడంతో పాటు బదిలీల్లో జరిగిన అవకతవకలపై కేశ్‌ శుక్లా నివేదికపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని పరమ్‌వీర్‌ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక హోంమంత్రి ఆరోపణలపై సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశం ఉన్నందున, అంతకు ముందే ఆయనపై నిష్పాక్షికమైన దర్యాప్తు చేయాలని పరమ్‌వీర్‌ సింగ్‌ కోరారు. తాను హోంమంత్రిపై చేసిన ఆరోపణలను ధ్రువపరిచే సాక్ష్యాల్లో భాగంగా, అనిల్‌ దేశ్‌ముఖ్‌ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ వీడియోలను కూడా సేకరించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై పరమ్‌వీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు అబద్ధమని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పష్టంచేశారు. ముకేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపుకేసులో అరెస్టైన సచిన్‌ వాజే, హోంమంత్రిని కలిసినట్లు పరమ్‌వీర్‌ చేస్తోన్న ఆరోపణల్లోనూ నిజం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని