బెంగాల్‌లో కలకలం.. 200 శునకాల దుర్మరణం

బెంగాల్‌లో శునకాల అనుమానాస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. బెంగాల్‌లోని బాంకురా జిల్లా బిష్ణుపూర్‌ పట్టణంలో మూడు రోజుల వ్యవధిలో 200లకు పైగా వీధి శునకాలు మృత్యువాత పడ్డాయి.....

Published : 21 Feb 2021 01:16 IST

కోల్‌కతా: బెంగాల్‌లో శునకాల అనుమానాస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. బెంగాల్‌లోని బంకురా జిల్లా బిష్ణుపూర్‌ పట్టణంలో మూడు రోజుల వ్యవధిలో 200లకు పైగా వీధి శునకాలు మృత్యువాత పడ్డాయి. మంగళవారం నాడు 60, బుధవారం ఏకంగా 97 , గురువారం రోజున 45 శునకాలు మృతిచెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసినట్లు వారు పేర్కొన్నారు. కాగా మృతిచెందిన శునకాల నుంచి నమూనాలు సేకరించిన వెటర్నరీ సిబ్బంది పరీక్షల నిమిత్తం వాటిని కోల్‌కతా పంపించారు. అయితే పెద్ద ఎత్తున కుక్కల మృతికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణమని వైద్య సిబ్బంది అనుమానిస్తున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని