నో మాస్క్: 15లక్షల మందికి జరిమానా!
బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని 15లక్షల మందిపై చర్యలు తీసుకున్న అధికారులు, దాదాపు రూ.30కోట్లను వసూలు చేసినట్లు వెల్లడించారు.
ముంబయి అధికారుల చర్యలు
ముంబయి: కరోనా వైరస్ మహమ్మారి భారత్లో అన్ని రాష్ట్రాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో మాత్రం వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రతిఒక్కరూ మాస్క్ ధరిస్తూ, కొవిడ్ నిబంధనలు పాటించాలని ముంబయి అధికారులు సూచిస్తున్నారు. అయితే, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని 15లక్షల మందిపై చర్యలు తీసుకున్న అధికారులు, వారినుంచి దాదాపు రూ.30కోట్లను వసూలు చేసినట్లు వెల్లడించారు.
కరోనా ధాటికి వణికిపోయిన ముంబయిలో వైరస్ వ్యాప్తి కట్టడికి బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ఇందులోభాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. కేవలం సోమవారం ఒక్కరోజే 13వేల మందికి జరిమానా విధించగా, వీరి నుంచి రూ. 26లక్షలు వసూలు చేశారు. ఇలా గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15, 2021 మధ్య కాలంలో మాస్కు ధరించని 15లక్షల (15,16,398) మందికి జరిమానా విధించి, వీరి నుంచి రూ.30కోట్ల (30,69,09,800)ను వసూలు చేశామని వెల్లడించారు. ముంబయిలోని ప్రముఖ ప్రాంతాలైన జుహూ, అంధేరీ, వెర్సోవా వంటి ప్రాంతాల్లోనే కొవిడ్ నిబంధనలు పాటించని దాదాపు లక్ష మందికి జరిమానా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మరోసారి లాక్డౌన్ తప్పదు..!
ఇదిలాఉంటే, ముంబయిలో కరోనా తీవ్రత అదుపులోకి వస్తున్నట్లు భావిస్తున్న సమయంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ముంబయి అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నగరంలో లోకల్ రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిత్యం దాదాపు 34లక్షల మంది ప్రయాణించే ఈ లోకల్ సబర్బన్ రైళ్లలో కొవిడ్ వ్యాప్తికి ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రైళ్లలోనూ మాస్కులు ధరించని వారిపై రైల్వే పోలీసుల సహకారంతో బీఎంసీ అధికారులు జరిమానా విధిస్తున్నారు. అయితే, నగరంలో కొవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే, ముంబయిలో మరోసారి లాక్డౌన్ విధించాల్సి వస్తుందని నగర మేయర్ హెచ్చరించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక, రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ