Vaccination: రాష్ట్రాల్లో 15.69 కోట్లకుపైగా టీకా నిల్వలు
విడ్ డోసుల పంపిణీలో ఇప్పటికే వంద కోట్ల మైలురాయి అందుకున్న భారత్లో.. శనివారానికి ఈ సంఖ్య 108 కోట్లు దాటింది. ఇందులో 74.09 కోట్లు మొదటి డోసు కాగ, 34.13 కోట్లు రెండో డోసుకు సంబంధించినవి.
దిల్లీ: కొవిడ్ డోసుల పంపిణీలో ఇప్పటికే వంద కోట్ల మైలురాయి అందుకున్న భారత్లో.. శనివారానికి ఈ సంఖ్య 108 కోట్లు దాటింది. ఇందులో 74.09 కోట్లు మొదటి డోసు కాగ, 34.13 కోట్లు రెండో డోసుకు సంబంధించినవి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ట్వీట్ చేసింది. కరోనాపై పోరాటంలో మరో ఘనత సాధించినట్లు పేర్కొంది. శనివారం 27.43 లక్షలకు పైగా డోసులు వేశారు. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 116.54 కోట్లకు పైగా డోసులను ఉచితంగా సరఫరా చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం వాటి వద్ద 15.69 కోట్లకు పైగా డోసులు నిల్వ ఉన్నట్లు తెలిపింది.
32 శాతం మందికే రెండు డోసులు..
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే.. వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదట్లో టీకా కొరత ఉన్నట్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన రాష్ట్రాలు.. ప్రస్తుతం పంపిణీలో మాత్రం డీలా పడినట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో రోజువారీగా 78 లక్షల డోసులను పంపిణీ చేయగా, అక్టోబర్ నాటికి 56 లక్షలకు తగ్గడం గమనార్హం. ఇప్పటివరకు కేవలం 32 శాతం మందికి మాత్రమే రెండు డోసులు అందించారు. అయితే సెకండ్ డోసు తీసుకునేందుకు చాలా మంది ముందుకు రావడం లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్