Omicron: రోగనిరోధక శక్తి తగ్గితే ఒకరి శరీరంలోనే పలు మ్యూటేషన్లు..!
ప్రపంచానికి దక్షిణాఫ్రికా తెలియజేసిన సార్స్కోవ్-2 ఒమిక్రాన్ వేరియంట్ ఓ హెచ్ఐవీ పేషెంట్ నుంచి వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి.
గతంలోనే గుర్తించిన శాస్త్రవేత్తలు
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచానికి దక్షిణాఫ్రికా తెలియజేసిన సార్స్కోవ్-2 ఒమిక్రాన్ వేరియంట్ ఓ హెచ్ఐవీ పేషెంట్ నుంచి వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. హెచ్ఐవీ పేషెంట్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారి నుంచి కొత్త మ్యూటేషన్లు రావడం ఇదే తొలిసారి ఏమీ కాదు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇటువంటి పలు రకాల కేసులు వచ్చాయి. రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్న వ్యక్తిలో చాలా కాలం ఇన్ఫెక్షన్ కొనసాగితే.. వారిలో వైరస్ మ్యూటేషన్లకు దారి తీస్తుందని తేలింది. ఇలాంటి వ్యక్తుల్లో వచ్చే మ్యూటేషన్లకు రోగనిరోధక శక్తిని తప్పుదోవ పట్టించే లేదా యాంటీబాడీస్ను తట్టుకొనే లక్షణాలు ఉంటున్నట్లు కూడా అర్థమవుతోంది.
వైరస్లు.. జంతువులు, మనుషులకు సోకినప్పుడు విపరీతంగా పునరుత్పత్తి చేస్తాయి. పునరుత్పత్తి సమయంలో జన్యువుల్లో పొరపాట్లతో కొత్తగా పుట్టుకొచ్చే వైరస్ల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకొంటాయి. వీటినే మ్యూటేషన్లు అంటారు. మార్పునకు గురైన వైరస్ కొత్తరూపాన్ని స్ట్రెయిన్ అంటారు. కరోనా వైరస్ కూడా చాలా సార్లు మార్పు చెందింది. ప్రస్తుతానికి ఈ మార్పులు వైరస్ జన్యు క్రమంలో ఒక శాతంలో పదోవంతు కంటే తక్కువే. ఇవి వేగంగా జరిగితే త్వరలోనే ఈ వైరస్ కొత్త జాతిగా మారొచ్చు. ఇక కరోనా వైరస్ ఆతిథ్య కణంలోపలే పునరుత్పత్తి అవుతుంది. బయట పునరుత్పత్తి చేయదు.
102 రోజులు కొవిడ్తో అవస్థపడి..
ఏకంగా 102 రోజులపాటు కొవిడ్తో పోరాడి కన్నుమూసిన ఓ వ్యక్తి కేసును కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ పేషెంట్ వయస్సు 72ఏళ్లు. ఆ పేషెంట్కు లింఫోమా అనే రకం క్యాన్సర్ ఉంది. ఈ లింఫోసిస్టమ్కు రోగనిరోధక శక్తికి దగ్గరి సంబంధం ఉంది. ఆ పేషెంట్ కీమో థెరపీ తీసుకొన్నాడు. అతడికి కొవిడ్ సోకి 102 రోజుల పాటు ఇబ్బంది పడి మృతి చెందాడు.
ఈ 102 రోజుల్లో వేర్వేరు సందర్భాల్లో 23సార్లు నమూనాలు తీసుకొని వైరస్ జన్యువులను విశ్లేషించారు. ఈ సందర్భంగా పలు రకాల మ్యూటేషన్లను గుర్తించారు. అవి వేగంగా వ్యాపించడం.. రోగ నిరోధక శక్తిని తప్పించుకునే లక్షణాలను కలిగి ఉండటం వంటి లక్షణాలున్నట్లు తేల్చారు. 57 రోజుల వ్యవధిలో రెండు సార్లు రెమిడెసివిర్ కోర్సును వాడారు. కానీ, ఆ ఔషధం విఫలమైంది. దీంతో కొన్నాళ్లు కన్వల్సెంట్ ప్లాస్మా చికిత్సను చేశారు. ఆ సమయంలో అతనిలో వైరస్ మరింత వేగంగా మ్యూటేషన్ చెందుతున్నట్లు గుర్తించారు. లింఫో క్యాన్సర్, కీమోథెరపీ కారణంగా రోగనిరోధక శక్తి బాగా బలహీనపడి ఈ విధంగా జరిగినట్లు వైద్యులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫిబ్రవరిలో నేచర్ పత్రిక వెల్లడించింది.
152 రోజులు 12 మ్యూటేషన్లు..
హార్వర్డు మెడికల్ స్కూల్ పరిశోధించిన మరో కేసులో పేషెంట్ 152 రోజులపాటు కొవిడ్తో పోరాడారు. అతడు రోగనిరోధక శక్తిని తగ్గించేందుకు గతంలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో ఆ పేషెంట్ యాంటీ కాగ్యులెంట్స్, స్టెరాయిడ్స్, యాంటీవైరల్స్ వినియోగించాడు. అతడికి కొవిడ్ సోకి 152 రోజులు పాటు ఉంది. ఆ క్రమంలో శాస్త్రవేత్తలు అతడిలో వైరస్ స్పైక్ ప్రొటీన్లో మొత్తం 12 మ్యూటేషన్లను గమనించారు. వీటిల్లో కొన్ని ఇమ్యూనిటీని తప్పించుకొనేవిగా గుర్తించారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ఇటువంటి పలు కేసులను శాస్త్రవేత్తలు, వైద్యులు గుర్తించారు. దీనిపై అమెరికా శాస్త్రవేత్తలు న్యూఇంగ్లాండ్ మెడికల్ జర్నల్లో వ్యాసం రాశారు. ముఖ్యంగా కొందరు క్యాన్సర్ చికిత్సలు, గ్లూకోకార్టికాయిడ్ల వినియోగం, దీర్ఘకాలిక కీమో లేదా రేడియోథెరపీ చేయించుకుని.. వివిధ మార్గాల్లో ఇమ్యూనిటీని తగ్గించుకుంటున్నారు. అటువంటి వారిలో రోగనిరోధక శక్తిని తప్పించుకొనే మ్యూటేషన్లు రూపొందుతాయేమో పరిశోధించాలని పేర్కొన్నారు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిలో సార్స్కోవ్-2 ఎక్కువకాలం ఉంటే.. అది ఇమ్యూనిటీని తట్టుకొనే ఉత్పరివర్తనాలకు కారణం కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ