Omicron: ఒమిక్రాన్ ఉద్ధృతితో.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు..!
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి
డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
స్టాక్హోం: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో మరిన్ని కొత్త, అత్యంత ప్రమాదకర వేరియంట్లు ఉద్భవించే ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని తీవ్రత భయపడినదానికంటే తక్కువగానే ఉంది. అయితే ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉండటంతో ఈ వేరియంట్ ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కూడా ఉందని డబ్ల్యూహెచ్ఓ సీనియర్ ఎమర్జెన్సీస్ ఆఫీసర్ కేథరిన్ స్మాల్వుడ్ హెచ్చరించారు. ‘‘ఒమిక్రాన్ ఎంత ఎక్కువ విస్తరిస్తే.. వ్యాప్తి అంత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కొత్త, మరింత ప్రమాదకర వేరియంట్లు రూపాంతరం చెందే అవకాశం ఎక్కువగా ఉంది. డెల్టా కంటే తీవ్రత తక్కువే అయినప్పటికీ ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే. మరి దీని తర్వాత వచ్చే వేరియంట్లు ఇంకా ఎలా ఉంటాయో ఎవరూ ఊహంచలేరు. ప్రస్తుతం మనమిప్పుడు అత్యంత ప్రమాదకర దశలో ఉన్నాం. ఇన్ఫెక్షన్ రేటు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల ఒమిక్రాన్ ఉద్ధృతిని ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేం’’ అని కేథరిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఒమిక్రాన్ వ్యాప్తితో కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచంపై విరుచుకుపడుతోంది. దీని ధాటికి అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. అక్కడ ఒక్క రోజే 10లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవడం వైరస్ ఉద్ధృతికి అద్దంపడుతోంది. ఇక ఐరోపా దేశాల్లోనూ కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. యూకేలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 2లక్షలు దాటాయి. కొవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఐరోపాలో ఇప్పటివరకు 10కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు. అమెరికాలో 5కోట్ల మందికి పైగా వైరస్ సోకింది.
ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్ అబ్దీ మహముద్ మంగళవారం పేర్కొన్నారు. ఈ వేరియంట్ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. అయితే అన్నిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బారిన పడినవారిలో ఆసుపత్రుల పాలు కావడం చాలా తక్కువని, మరణాలు చాలా చాలా తక్కువని తెలిపారు. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందని భావించలేమన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్లో సాంక్రమికశక్తి కనిపిస్తోందని చెప్పారు. అమెరికాలో కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని ఆయన ఉటంకించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు