Omicron: ఒమిక్రాన్ పుట్టుకకు జలుబూ సహకరించిందా?
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. దీనిపై సమగ్ర సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు....
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. దీనిపై సమగ్ర సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తే కట్టడి సులభమయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో మసాచూసెట్స్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ డేటా అనలిటిక్స్ ఎన్ఫరెన్స్ సంస్థ కీలక విషయాన్ని తెరపైకి తెచ్చింది. ఒమిక్రాన్లో వచ్చిన పరివర్తనాల్లో కనీసం ఒకటి సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్ వల్ల అయి ఉంటుందని పేర్కొంది. ఈ అధ్యయనానికి వెంకట సౌందరాజన్ అనే శాస్త్రవేత్త నేతృత్వం వహించారు. దీన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
కరోనా, జలుబు రెండూ సోకిన వ్యక్తిలో ఈ పరివర్తనం జరిగి ఉంటుందని అధ్యయనం తెలిపింది. రెండు వైరస్లతో ఇన్ఫెక్ట్ అయిన కణంలో ఈ ప్రక్రియ చోటు చేసుకొని ఉంటుందని పేర్కొంది. ఊపిరితిత్తులు, జీర్ణశయాంతర వ్యవస్థల్లో కరోనా వైరస్, జలుబు వైరస్ రెండూ ఒకేసారి కలిసి ఉండే అవకాశం ఉందని గతంలో కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఆ సమయంలోనే వైరల్ రీకాంబినేషన్ జరిగి ఉంటుందని తాజా పరిశోధన తెలిపింది. ఈ ప్రక్రియలో సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్లోని కొంత జన్యు పదార్థాన్ని కరోనా వైరస్ తీసుకొని ఉంటుందని తెలిపింది. ఒమిక్రాన్లో వచ్చిన అనేక పరివర్తనాల్లో ఒకదానికి ఇది కారణమై ఉంటుందని వెల్లడించింది. ఈ పరివర్తనంలో ఉన్న జన్యుక్రమం గతంలో వచ్చిన ఏ వేరియంట్లోనూ కనిపించలేదని తెలిపింది. కానీ, జలుబుకు కారణమయ్యే వైరస్ సహా మానవ జన్యుక్రమంలోనూ ఇది ఉన్నట్లు తెలిపారు.
ఈ పరివర్తనం వల్లే ఎక్కువగా వ్యాప్తి చెందే గుణాన్ని ఒమిక్రాన్ పొంది ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే లక్షణాలు, వ్యాధి తీవ్రత మాత్రం స్వల్పంగానే ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల తలెత్తుతున్న లక్షణాలు, వాటి తీవ్రతను నిర్ధారించే సమాచారమేదీ అందుబాటులో లేదు.
‘‘ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ రేటు కూడా ఎక్కువే. హెచ్ఐవీ వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడి జలుబు సహా ఇతర ఇన్ఫెక్షన్లు సోకి ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతంలోనే రీకాంబినేషన్లు చోటుచేసుకొని ఒమిక్రాన్ జనించి ఉంటుంది. కొత్త వేరియంట్ల పుట్టుక వ్యాక్సిన్ల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి’’ అని సౌందరరాజన్ తెలిపారు.
ఒమిక్రాన్ను అర్థం చేసుకోవడానికి మరింత నిర్దిష్టమైన, లోతైన అధ్యయనాలు జరగాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్ ఎలుకల్లో పరివర్తనం చెంది ఉంటుందన్న వాదన కూడా ప్రాచుర్యంలో ఉండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.