Omicron: ఒమిక్రాన్తో రీఇన్ఫెక్షన్ ముప్పు.. డెల్టా కంటే అధికంగానే..!
ప్రపంచ దేశాలకు వణుకుపుట్టిస్తోన్న ‘ఒమిక్రాన్’ వేరియంట్ను ‘అత్యంత ఆందోళనకర రకం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పేర్కొంది. తాజాగా సింగపూర్ ఆరోగ్యశాఖ ఈ
సింగపూర్ ఆరోగ్యశాఖ వెల్లడి
సింగపూర్: ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోన్న ‘ఒమిక్రాన్’ వేరియంట్ను ‘అత్యంత ఆందోళనకర రకం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పేర్కొంది. తాజాగా సింగపూర్ ఆరోగ్యశాఖ ఈ వేరియంట్పై మరిన్ని కీలక విషయాలు వెల్లడించింది. గతంలో వెలుగుచూసిన కరోనా డెల్టా, బీటా వేరియంట్ల కంటే ‘ఒమిక్రాన్’తో రీఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉండనుందని తెలిపింది. ఈ మేరకు ఒమిక్రాన్పై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్లినికల్ అధ్యయనాల ద్వారా ఈ విషయం వెల్లడైందని పేర్కొంది.
‘‘డెల్టా, బీటా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ రకం మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇక గత రకాల కంటే ఈ వేరియంట్తో రీఇన్ఫెక్షన్ ముప్పు అధికంగా ఉండే అవకాశాలున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే.. కరోనా నుంచి కోలుకున్నవారు కూడా ఒమిక్రాన్తో రీఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలూ ఎక్కువే’’ అని సింగపూర్ ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ వేరియంట్కు సంబంధించి ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉందని అభిప్రాయపడింది.
ఒమిక్రాన్ను ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఉన్న కరోనా టీకాలు సమర్థంగా పనిచేస్తాయా? లేదా? అన్నదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కోవడం, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ప్రస్తుతమున్న టీకాలు కొంతవరకు పనిచేస్తున్నాయని పలు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు పేర్కొంది. అంతేగాక, ఒమిక్రాన్తో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని, ఈ వేరియంట్ కారణంగా మరణాలు కూడా నమోదు కాలేదని తెలిపింది. అయితే ఈ అంశాలతో ఒమిక్రాన్పై అభిప్రాయానికి రావడం సరికాదని, దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అప్పటివరకు ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, టీకాలు, బూస్టర్ డోసులు తీసుకోవాలని అభ్యర్థించింది.
సింగపూర్లో ఆదివారం మరో ఒమిక్రాన్ అనుమానిత కేసు వెలుగు చూసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్గా తేలిందని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న సదరు మహిళ.. డిసెంబరు 1న దక్షిణాఫ్రికా నుంచి సింగపూర్కు వచ్చిన మరో ఇద్దరు ఒమిక్రాన్ అనుమానిత వ్యక్తులు ప్రయాణించిన విమానంలోనే ఉన్నట్లు చెప్పింది. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో మూడు ఒమిక్రాన్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. బాధితుల రక్తనమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం