ట్రంప్పై ప్రేమతో రష్యా ..!
అమెరికాలో జరిగిన 2020 అధ్యక్ష ఎన్నికల్లో కూడా రష్యా మరోసారి జోక్యం చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ యావ్రిల్ హెయిన్స్ ధ్రువీకరించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్కు లబ్ధిచేకూర్చి బైడెన్ను నష్టపర్చేలా ప్రయత్నాలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అమెరికా ఎన్నికల్లో మరోసారి జోక్యం
బాంబుపేల్చిన ఇంటెలిజెన్స్ విభాగం
ఇంటర్నెట్డెస్క్: అమెరికాలో జరిగిన 2020 అధ్యక్ష ఎన్నికల్లో కూడా రష్యా మరోసారి జోక్యం చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ యావ్రిల్ హెయిన్స్ ధ్రువీకరించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్కు లబ్ధిచేకూర్చి బైడెన్ను నష్టపర్చేలా ప్రయత్నాలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ట్రంప్కు సన్నిహితులైన అధికారులను వినియోగించుకొని బైడెన్పై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ఓటమికి రష్యానే కారణమని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అలాంటిది వరుసగా మరో సారి అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలిసో.. తెలియకో ట్రంప్ సన్నిహితులైన అధికారులు వీరికి ఉపయోగపడినట్లు గుర్తించింది.
ట్రంపే స్వయంగా అమెరికా ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేట్లు వ్యవహరించేట్లు చేశారని ఈ నివేదిక పేర్కొంది. ఆయన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు ట్రంప్ ఆరోపించారని.. కొంత మంది రిపబ్లికన్ పార్టీ గవర్నర్లు ఆయనకు వంతపాడారని వెల్లడించింది. చివరికి ఇవి క్యాపిటల్ హిల్ దాడికి కారణం అయ్యాయని పేర్కొంది. ఇదే విధానంలో రష్యా 2024 ఎన్నికల్లో జోక్యం చేసుకోకపోవచ్చని తెలిపింది. ఇరాన్ కూడా అమెరికా ఎన్నికల్లో జోక్యానికి ప్రయత్నించిందని వెల్లడించింది. చైనా కూడా ప్రయత్నించినా ఆ స్థాయిలో విజయవంతం కాలేకపోయిందని వెల్లడించింది.
ఉక్రెయిన్ నేతలను వాడుకొని..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ చట్ట సభ సభ్యుడు ఆండ్రీ డెర్కెచ్ను ఉపయోగించుకొని ట్రంప్ను ప్రభావితం చేసినట్లు గుర్తించింది. అండ్రీ పక్కా రష్యా ఏజెంట్ అని ఆ నివేదికలో వెల్లడించారు. ట్రంప్ అటార్ని రూడీ గులియానీని అతను వాడుకొని తప్పుడు సమాచారాన్ని వ్యాపింప జేశారని పేర్కొన్నారు. బైడెన్ కుమారుడిపై మాస్కోకు అత్యంత సన్నిహితమైన వారే తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేశారని వెల్లడించింది. ఈ ఇంటెలిజెన్స్ నివేదికలో గులియానీ పేరును నేరుగా వాడలేదు. ట్రంపు చుట్టుపక్కల వ్యక్తులు ఏవి పడితే అవి నమ్మే వారు కావడంతో.. రష్యా దానిని వాడుకొని కూడా ఉండొచ్చని నివేదిక వెల్లడించింది.
2020 మొదటి నుంచి బైడెన్, ఆయన కుటుంబీకులు ఉక్రెయిన్తో కలిసి అక్రమాలకు పాల్పడ్డట్లు రష్యా ప్రచారం మొదలుపెట్టింది. వాస్తవానికి బైడెన్గానీ, ఆయన కుమారుడిపై గానీ వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని తాజా నివేదిక వెల్లడించింది. కానీ, ట్రంప్ ప్రచారంలో అదే కేంద్రబిందువుగా మారిందని పేర్కొంది. అమెరికా ఎన్నికల వ్యవస్థలోకి విదేశీ శక్తులు ఎంతలా చొచ్చుకు రావచ్చో ప్రచారం సందర్భంగా ట్రంప్ వాడిన సమాచారం తెలియజేస్తోందని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ