​​​​​​ఆస్పత్రి ఫ్లోర్‌ తుడిచిన మంత్రి

అధికార దర్పం పక్కనపెట్టి ఆసుపత్రిలో నేలను తుడిచి ఆశ్చర్యపర్చారు మిజోరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌ లాల్జిర్లియానా. అది కూడా కరోనాతో బాధపడుతూ, చికిత్స పొందుతున్న.

Published : 15 May 2021 18:22 IST

ఐజ్వాల్‌: అధికార దర్పం పక్కనపెట్టి ఆసుపత్రిలో నేలను తుడిచి ఆశ్చర్యపర్చారు మిజోరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌ లాల్జిర్లియానా. అది కూడా కరోనాతో బాధపడుతూ, చికిత్స పొందుతున్న వేళ. ఆసుపత్రిలో నేల శుభ్రం చేస్తున్న చిత్రం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

‘ఆసుపత్రిలో నేలను తుడిచి నేను వైద్యులు, నర్సులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. నేనొక ఉదాహరణగా నిలిచి, ఇతరులకు అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన’ అని ఆ మంత్రి మీడియాతో అన్నారు. తానున్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్‌కి పోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన రాలేదని, దీంతో తానే శుభ్రం చేసినట్లు వివరించారు. ‘నాకు ఇలాంటి పనులు కొత్తేం కాదు. అవసరం అనుకున్నప్పుడు నేను ఈ పనులు చేశాను. నేను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. ఇతరుల కంటే ఎక్కువని అనుకోవట్లేదు’ అని ఆయన చెప్పారు. మంత్రితో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా అదే ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని