Gadchiroli Encounter: తేల్తుంబ్డే మృతి.. పలువురిపై భారీ క్యాష్ రివార్డ్: పోలీసులు
మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలిలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్తుంబ్డే మృతిచెందినట్లు మహారాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు.
ముంబయి: మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలిలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్తుంబ్డే మృతిచెందినట్లు మహారాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. మరణించిన 26 మంది మావోయిస్టుల్లో కూడా చాలా మందిపై క్యాష్ రివార్డు ఉందని తెలిపారు. ఘటనానంతరం మావోయిస్టులకు చెందిన ఆయుధాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని గ్యార్పట్టి అడవుల్లో శనివారం మధ్యాహ్నం ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 20 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరిలో 10 మంది వివరాలను ధ్రువీకరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో తేల్తుంబ్డే కూడా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన సహా ఆయన ఇద్దరు బాడీగార్డులు సైతం మృతిచెందినట్లు పేర్కొన్నారు.
గట్టి దెబ్బ: గడ్చిరోలీ డీఐజీ
తేల్తుంబ్డే మృతితో మహారాష్ట్ర- మధ్యప్రదేశ్- ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) జోన్లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని గడ్చిరోలి రేంజ్ డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. గత 20 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్న వ్యక్తుల్లో తేల్తుంబ్డే ఒకరని చెప్పారు. మహారాష్ట్రలో మావోయిస్టు కార్యకలాపాల విస్తరణలో కీలక భూమిక పోషించారని చెప్పారు. మహరాష్ట్రలో ఆయన మినహా మిగతా ఎవరూ పెద్ద నాయకులు లేరని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్లో సైతం ఆయనది కీలక పాత్ర అని, ఏళ్లుగా ఆయన కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఎల్గార్ పరిషద్ కేసులో నిందితుల్లో తేల్తుంబ్డే ఒకరని ఎన్ఐఏ గతంలో ఛార్జీషీటులో పేర్కొంది. అనిల్, దీపక్, సహ్యద్రి, కామ్రేడ్ ఎం పేర్లతో చలామణీ అయినట్లు ఎన్ఐఏ తెలిపింది.
పలువురిపై క్యాష్ రివార్డు
గడ్చిరోలి ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో చాలా మంది మావోయిస్టులపై భారీ క్యాష్ రివార్డు ఉందని మహారాష్ట్ర పోలీసులు చెప్పారు. తేల్ తుంబ్డేపై రూ.50 లక్షలకు రివార్డు ఉందని, ఆయనతో పాటు మావోయిస్టు నంబర్ 4 కంపెనీ కమాండర్ లోకేశ్ అలియాస్ మంగు పోడ్యంపై రూ.20 లక్షల రివార్డు ఉందని చెప్పారు. డివిజనల్ కమిటీ సభ్యుడైన మహేశ్ అలియాస్ శివాజీరావ్జీ గోటాపై రూ.16 లక్షలకు రివార్డు ఉందని పేర్కొన్నారు. వీరితో పాటు పలు ఘటనల్లో నిందితులుగా ఉన్న వారిపై రూ.2 నుంచి రూ.8 లక్షల వరకు రివార్డు ఉందని చెప్పారు. పలువురు మహిళా మావోయిస్టుల మీద రివార్డు ఉందని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం