trump: ట్రంప్నకు వెన్నుపోటు పొడిచిన ఆర్మీ జనరల్..!
ఓ అమెరికా జనరల్ దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్కు ఫోన్ చేసి ముందే చెప్పేశారు. కొన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చింది.. దీంతో యుద్ధాన్ని నివారించేందుకు అలా చేశానని ఇప్పుడా జనరల్
చైనా జనరల్కు ఫోన్.. మార్క్మిల్లీ నిర్వాకం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఓ అమెరికా జనరల్ దేశ అధ్యక్షుడి ఆలోచనలను చైనా జనరల్కు ఫోన్ చేసి ముందే చెప్పేశారు. కొన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చింది.. దీంతో యుద్ధాన్ని నివారించేందుకు అలా చేశానని ఇప్పుడా జనరల్ తాను చేసిన పని సమర్థించుకొంటున్నారు. అతనికి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అండగా నిలుస్తున్నారు. తాజాగా ఆ జనరల్ అమెరికా కాంగ్రెస్ విచారణకు హాజరుకావడంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.
ఏమి జరిగింది..?
ట్రంప్ హయాంలో అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్గా మార్క్ మిల్లీని నియమించారు. అదే సమయంలో అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ విషయంలో ట్రంప్ చైనాపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ విషయాన్ని మార్క్ మిల్లీ గమనించారు. ఆయన చైనాపై అణు దాడి చేయవచ్చని ఊహించుకున్నారు. అక్టోబర్ 30వ తేదీన చైనా జనరల్ లీ జూఛెంగ్కు ఫోన్ చేశారు. తమ అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని.. యుద్ధం ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వొచ్చని వెల్లడించాడు. చైనా వెంటనే ప్రతిదాడి చేయవద్దని కోరారు. అనంతరం జనవరి 8వ తేదీన మార్క్ మిల్లీ మరోసారి చైనా జనరల్కు ఫోన్ చేశారు. ట్రంప్ పదవిని వీడే సమయంలో దాడికి ఆదేశాలు ఇవ్వొచ్చనే విషయాన్ని వెల్లడించాడు. తనకు ఆదేశాలు వస్తే ముందే వెల్లడిస్తానని చైనా జనరల్కు చెప్పారు. అంతేకాదు కీలక అమెరికా సైనిక జనరల్స్ను సమావేశపర్చి ట్రంప్ ఆదేశాలను వెంటనే అమలు చేయవద్దని సూచించారు. ఈ విషయం మొత్తం బాబ్ ఉడ్వర్డ్, రాబర్ట్ కోస్టాలు రాసిన ‘పెరల్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. మార్క్ మిల్లీ నైతికంగా నేరస్థుడని రచయితలు అభిప్రాయపడ్డారు. ఉడ్వర్డ్ ఈ పుస్తకం రాసేందుకు గతంలో మార్క్ మిల్లీని ఇంటర్వ్యూ చేశారు. దీంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ట్రంప్ ఈ విషయం తెలిసి మండిపడ్డారు. ఈ కాల్స్ చేయడానికి అధ్యక్షుడి నుంచి మిల్లీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు.
మిల్లీ ఏమంటున్నారు..?
తాజాగా సెనెట్ ఆర్మ్డ్ సర్వీస్ కమిటీ అఫ్గాన్ పరిణామాలతో సహా పలు అంశాలపై విచారణ చేపట్టింది. ఈ కమిటీలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు సభ్యులుగా ఉంటారు. వీరు మార్క్ మిల్లీని ఫోన్కాల్స్పై ప్రశ్నించారు. ‘ఆ సమయంలో ఉద్రిక్తతలను తగ్గించడం నా కర్తవ్యం’ అని మిల్లీ సెనెటర్లకు వివరించారు. ట్రంప్నకు అలాంటి ఉద్దేశం లేదనే విషయం తనకు తెలుసునని పేర్కొనడం విశేషం. అంతేకాదు తాను ఫోన్ కాల్స్ చేసిన విషయం ట్రంప్ కార్యవర్గంలోని చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మార్కె ఎస్పర్లకు తెలుసని చెప్పారు. అదే సమయంలో జనవరి 8వ తేదీన స్పీకర్ నాన్సీ పెలోసీ ఫోన్కాల్ విషయాన్ని కూడా వెల్లడించారు. పెలోసీ కూడా అధ్యక్షుడు అణ్వాయుధాలను వాడే సామర్థ్యంపై ప్రశ్నించారని చెప్పారు. అణ్వాయుధాల వాడకానికి ఒక విధానం ఉందని.. దానిని మినహాయించి.. చట్టవిరుద్ధంగా, ప్రమాదవశాత్తు వాటిని వినియోగించకుండా చేస్తానని పెలోసికి చెప్పినట్లు మిల్లీ వివరించారు.
వెనకేసుకొస్తున్న శ్వేతసౌధం..
మిల్లీ చర్యలపై రిపబ్లికన్లు మండిపడుతున్నారు. అతను రాజీనామా చేయడం కానీ, అధ్యక్షుడు అతన్ని తొలగించడం కానీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెనెటర్ మార్కో రూబియో ఈ మేరకు బైడెన్కు ఓ లేఖ కూడా రాశారు. దీనిపై శ్వేత సౌధం స్పందిస్తూ అధ్యక్షుడు బైడెన్కు మిల్లీపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. మిల్లీని.. ట్రంప్ ఆర్మీ చీఫ్గా నియమించారు. ఆ తర్వాత ఆయన్ను జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్గా నియమించారు. బైడెన్ మిల్లీని కొనసాగించారు. ప్రస్తుతం బైడెన్ సలహాదారుల్లో మిల్లీ కూడా ఒకరు.
అఫ్గానిస్థాన్ గందరగోళం బైడెన్ పనే..!
సెనెట్ ఆర్మ్డ్ సర్వీస్ కమిటీ విచారణ సందర్భంగా అఫ్గాన్కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ కమిటీ మిల్లీతోపాటు సెంట్ కామ్ కమాండర్ మెకంజీని కూడా ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భంగా వారు తాము అఫ్గాన్లో 2,500 మంది సైనికులను ఉంచమని అధ్యక్షుడికి చెప్పామన్నారు. తర్వాత శ్వేతసౌధం ప్రతినిధి జెన్సాకీ మాట్లాడుతూ ‘‘అధ్యక్షుడు జనరల్స్ సలహాలకు విలువిస్తారు. అలాగని వారుచెప్పిన దాంతో ఏకీభవిస్తారని అనుకోవద్దు’’ అని పేర్కొన్నారు.
వాస్తవానికి ఆగస్టు 19న జో బైడెన్ ఓ ఆంగ్ల పత్రికా విలేకరితో మాట్లాడుతూ అఫ్గాన్లో స్వల్ప సంఖ్యలో దళాలను కొనసాగించాలనే అంశంపై తనకు ఎవరూ సలహా ఇచ్చినట్లు గుర్తుకు రావడంలేదని అనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!