Havana syndrome: అమెరికన్లను భయపెడుతున్న హవానా సిండ్రోమ్..!
అమెరికా దౌత్యవేత్తలను ఓ ప్రత్యేమైన సిండ్రోమ్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అది ఎందుకు వస్తోందో అగ్రరాజ్యం శాస్త్రవేత్తలకు అంతుపట్టడంలేదు.. ఎవరో తమపై కుట్ర పన్నుతున్నారన్న అనుమానం కూడా అమెరికాలో
ఉపాధ్యక్షురాలి పర్యటనలో తీవ్ర జాప్యం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అమెరికా దౌత్యవేత్తలను ఓ ప్రత్యేమైన సిండ్రోమ్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అది ఎందుకు వస్తోందో అగ్రరాజ్యం శాస్త్రవేత్తలకు అంతుపట్టడంలేదు.. ఎవరో తమపై కుట్ర పన్నుతున్నారన్న అనుమానం కూడా అమెరికాలో ఉంది. తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వియత్నాం పర్యటన ఈ సిండ్రోమ్ కారణంగానే కొన్ని గంటలపాటు ఆలస్యమైంది. వియత్నాంలోని దౌత్య కార్యాలయం నుంచి ఓ వ్యక్తిని అత్యవసరంగా చికిత్స నిమిత్తం తరలించాల్సి వచ్చింది.
ఏమిటీ సమస్య..
అమెరికా దౌత్యవేత్తలను మాత్రమే పీడించే ఈ సమస్యను ‘హవానా సిండ్రోమ్’ అని అంటారు. 2016లో తొలిసారి దీనిని క్యూబాలో హవానా నగరంలోని అమెరికా దౌత్యకారాలయ సిబ్బందిలో గుర్తించారు. మెదడుపై ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. కందిరీగల దండు తమ వద్ద తిరుగుతున్నట్లు చప్పుడు వినిపిస్తుంటుంది. ఈ శబ్దం భరించలేని స్థాయిలో ఉంటుంది. దీని ప్రభావానికి గురైన వ్యక్తికి వికారం కలుగుతుంది. అంతేకాదు, విపరీతంగా అలసటతో పాటు.. ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోలేరు. క్యూబాలో ఈ ప్రభావానికి లోనైన వారిలో మూడోవంతు మందికి వినికిడి శక్తి దెబ్బతింది. వారి మెదడును స్కాన్ చేసిన డాక్టర్లకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఈ సిండ్రోమ్ బారిన పడిన వారి మెదడు దెబ్బతిన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఏదైనా ప్రమాదానికి గురైతే కానీ ఆ స్థాయిలో మెదడు దెబ్బతినదు. తొలిసారి హవానాలో బయటపడటంతో ఆ పేరుతోనే పిలుస్తున్నారు.
కొన్ని రకాల ఉద్యోగులు మాత్రమే ఈ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. క్యూబా, చైనా దౌత్యకార్యాలయాల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారు. దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బంది, సీఐఏ సిబ్బంది, విదేశాగ శాఖ సిబ్బంది ఈ జాబితాలో ఉన్నారు. గత ఐదేళ్ల నుంచి దాదాపు 200 మంది దీని బారిన పడి ఉంటారని అంచనా. మైక్రోవేవ్ తరంగాల సాయంతో గుర్తుతెలియని ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని అమెరికా అనుమానిస్తోంది. చైనా, ఆస్ట్రియా, పోలాండ్, రష్యాలోని అమెరికా దౌత్య సిబ్బంది ఈ సిండ్రోమ్ బాధితుల జాబితాలో ఉన్నారు. కొందరు కెనడా దౌత్యవేత్తలు కూడా ఈ సిండ్రోమ్ బారినపడినట్లు వార్తలొచ్చాయి.
2019లో కారులో ఉన్న ఒక అమెరికా సైనిక అధికారికి ఒక్కసారిగా తీవ్ర వికారంగా అనిపించింది. అదే సమయంలో వెనుకసీటులో ఉన్న అతడి రెండేళ్ల కుమారుడు కూడా విపరీతంగా ఏడవటం మొదలు పెట్టాడు. వారు కారు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఆ లక్షణాలు తగ్గాయి. అతని కుమారుడు కూడా కుదుట పడ్డాడు. ఈ ఘటన అమెరికా ప్రభుత్వాన్ని కలవర పర్చింది.
క్యూబా పై నింద..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో ఈ సిండ్రోమ్ వ్యాప్తికి క్యూబాను నిందించారు. కానీ, క్యూబా దీనిని తిరస్కరించింది. కానీ, ఆ తర్వాత అమెరికాలోని అధికారులు కూడా దీని బారిన పడినట్లు తేలింది. ప్రభుత్వం ఈ సిండ్రోమ్కు కారణమేంటో తెలుసుకొనే పనిలో పడింది. కొన్నాళ్ల క్రితం బైడెన్ కార్యవర్గం కూడా దీని సంగతేమిటో తేల్చాలని నిశ్చయించుకొంది. ఈ విషయంపై జూన్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకన్ ఒక ప్రకటన చేశారు.
తొలుత అమెరికా కొన్ని రకాల ‘సానిక్’ శబ్ద తరంగాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని అనుమానించింది. కానీ, అది తప్పు అని తేలడంతో ఇప్పుడు మైక్రోవేవ్ తరంగాలను వినియోగిస్తున్నట్లు బలంగా నమ్ముతోంది. ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్ అండ్ మెడిసిన్ (ఎన్ఏఎస్ఈఎం) పరిశోధనల ప్రకారం మైక్రోవేవ్ తరంగాలను వినియోగించే అవకాశం ఉందన్న అంచనాలకు వచ్చారు. సోవియట్ యూనియన్ 1950ల్లో మైక్రోవేవ్ తరంగాలను ఆయుధంలా వినియోగంచడంపై పరిశోధనలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2019లో జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఎన్ఏఎస్ఈఎం నివేదికను బలపర్చింది.
కమలా హారిస్ పర్యటన జాప్యం..
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆసియా దేశాల పర్యటనపై హవానా సిండ్రోమ్ ప్రభావం పడింది. వియత్నాంలోని అమెరికా దౌత్య సిబ్బంది హవానా సిండ్రోమ్ వంటి సమస్య బారిన పడినట్లు తేలింది. ఈ సారి దౌత్య సిబ్బంది ఇంటి వద్ద ఈ పరిస్థితి తలెత్తింది. గతంలో ఇక్కడి సిబ్బంది ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని సీబీఎస్ న్యూస్ పేర్కొంది. దీంతో ఒక్కసారి అప్రమత్తమైన అమెరికా సిబ్బంది కమలా పర్యటన ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!