Special Operations Group: ఉగ్రవేటకు ‘కార్గో’ రెడీ..!
జమ్ము కశ్మీర్లో పండట్లతో సహా ఇతర మైనార్టీలపై దాడులు పెరిగిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు నెలల నుంచి సుప్త చేతనావస్థలో ఉన్న స్పెషల్
* మళ్లీ సిద్ధమైన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
జమ్ము కశ్మీర్లో పండితులతో సహా ఇతర మైనార్టీలపై దాడులు పెరిగిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు నెలల నుంచి సుప్తచేతనావస్థలో ఉన్న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్వోజీ)ను మళ్లీ సిద్ధం చేసింది. జమ్ము కశ్మీర్ పోలీసుల్లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో అనుభవం ఉన్నవారితో దీనిని ఏర్పాటు చేశారు. దీని నిక్నేమ్ ‘కార్గో’..!
ఈ ఏడాది మే వరకు కార్గో బాధ్యతలు చూసిన తాహిర్ అష్రఫ్ను వేరే విభాగానికి బదిలీ చేశారు. అనంతరం మరొకరికి కార్గో అదనపు బాధ్యతలను అప్పజెప్పారు. కానీ, తాజాగా జమ్ము కశ్మీర్లో ఉగ్రదాడులు పెరగడంతో కార్గో పూర్తి స్థాయి బాధ్యతలను ఎస్పీ హోదాలో ఇఫ్తికార్ తాలిబ్కు అప్పజెప్పారు. ఆయనకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో మంచి అనుభవం ఉంది. ఆయన గతంలో ఎస్వోజీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇప్పటి వరకు లద్దాఖ్ రీజియన్లో డిప్యూటేషన్పై పని చేశారు. జమ్ము కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీంతోపాటు క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ సేకరణలో కూడా చురుగ్గా వ్యవహరిస్తోంది. దీనిలో మొత్తం 1000 మంది సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారు.
ఈ పేరు ఎలా వచ్చింది..
ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ కార్గో విభాగంలో ఎస్వోజీ ప్రధాన కార్యలయ భవనం ఉంది. అందుకే దీనికి కార్గో అనే పేరు వచ్చింది. జమ్ము కశ్మీర్లోని ఐజీ ర్యాంక్ హోదా ఉన్న అధికారి దీని కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఈ దళం మొత్తాన్ని చిన్న బృందాలుగా చేశారు. ఒక్కో బృందం ఒక్కో రకమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తుంది. కొన్ని బృందాలు ఫోన్ ట్రాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ను సేకరిస్తుంటాయి. దీంతోపాటు సోషల్ మీడియాను పరిశీలించే బృందాలు ఉన్నాయి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ సేకరణ కూడా కార్గో చేస్తుంది.
సాధారణంగా చినార్ కోర్లో భాగమైన రాష్ట్రీయ రైఫిల్స్ అత్యధికంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు నేతృత్వం వహిస్తుంది. ఒక్క శ్రీనగర్ తప్ప మిగిలిన చోట్ల వీటి ఆపరేషన్లకు ఆవసరమైన ఇన్ఫర్మేషన్ కార్గో బృందాల నుంచే లభిస్తుంది. జమ్ము కశ్మీర్లోని ప్రతి జిల్లాలో కార్గో బృందాలు ఉన్నాయి. కశ్మీర్లోని జిల్లాలో కార్గో దళాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. భారీగా ఉగ్రదాడులు జరిగిన చోట్ల దాదాపు 10 దళాలు పని చేసిన సందర్భాలూ ఉన్నాయి. జిల్లాలో వీటికి డీఎస్పీ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తున్నారు. కానీ, వీరందరికి ప్రధాన కార్యలయం మాత్రం శ్రీనగర్లోని కార్గో భవనమే.
ఈ ఎస్వోజీ ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లకు వినియోగించే వాహనం కూడా ప్రత్యేకమైందే. ఆపరేషన్ జరుగుతున్న ప్రదేశం 360 డిగ్రీల్లో కనిపించేలా ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. దీంతోపాటు ఈ బృందం అపరేషన్కు వెళితే అదనపు దళాలను కూడా సిద్ధంగా ఉంచుతారు. ఎస్వోజీ గ్రూప్ కమాండోలపై ఆరోపణలు రాకుండా బాడీ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు అధికారులు అవసరమైన సమయంలో వైర్లెస్ సెట్లలో సూచనలు చేస్తారు.
ఉగ్రవాదంలోకి వెళ్లిన యువతను గుర్తించే పనిని కూడా ఈ ఎస్వోజీ గ్రూప్ చేస్తుంది. హఠాత్తుగా ఎవరైనా యువకుడు అదృశ్యమైన సమాచారం అందిన వెంటనే అతడి గత చరిత్ర, పరిచయాలు వంటి కీలక సమాచారాన్ని తవ్వితీస్తుంది. దీనిని బట్టి అతడు ఏ ఉగ్రబృందంలోని రిక్రూటర్ల ప్రభావానికి లోనైంది గుర్తిస్తోంది. ఈ రకంగా చాలా మందిని మళ్లీ వెనక్కి తీసుకొచ్చినట్లు మే వరకు కార్గో ఎస్పీగా పనిచేసిన అష్రఫ్ పేర్కొన్నారు. ఉగ్ర నియామకాలు చేసే వారు వినియోగించే సోషల్ మీడియా కార్యకలాపాలను ఈ గ్రూప్ నిశితంగా పరిశీలిస్తుంటుంది. ఎవరైన యువత ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉచ్చులో పడినట్లు గుర్తిస్తే వెంటనే వారి తల్లిడంద్రులకు సమాచారం అందజేస్తుంది. కొన్ని సందర్భాల్లో వీరి ప్రయత్నాలు విఫలమవుతుంటాయి కూడా. అలాంటి సమయాల్లో మాత్రమే ఎన్కౌంటర్లు జరుగుతుంటాయని కార్గో బృందం చెబుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్