Cyber Attack: సైబర్ దాడి.. ఆ దేశమంతా నిలిచిపోయిన పెట్రోల్ పంపిణీ
ఇరాన్పై మంగళవారం సైబర్ ఎటాక్ జరిగింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ స్టేషన్లలో ఇంధన పంపిణీ వ్యవస్థ నిలిచిపోయినట్లు అధికారిక మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్(ఐఆర్ఐబీ) వెల్లడించింది. ఈ సైబర్ దాడి కారణంగా రాయితీ పెట్రోల్ విక్రయాలకు అంతరాయం ఏర్పడిందని, దీంతో దేశవ్యాప్తంగా...
టెహ్రాన్: ఇరాన్పై మంగళవారం సైబర్దాడి జరిగింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ స్టేషన్లలో ఇంధన పంపిణీ వ్యవస్థ నిలిచిపోయినట్లు అధికారిక మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్(ఐఆర్ఐబీ) వెల్లడించింది. ఈ సైబర్ దాడి కారణంగా రాయితీ పెట్రోల్ విక్రయాలకు అంతరాయం ఏర్పడిందని, దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ స్టేషన్ల వద్ద జనాలు భారీ ఎత్తున బారులు తీరారని పేర్కొంది. ‘సైబర్ అటాక్ కారణంగా కొన్ని గంటలుగా గ్యాస్ స్టేషన్లలో ఇంధనం నింపే వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు. త్వరలో పరిస్థితులు సాధారణానికి చేరుకుంటాయి’ అని తెలిపింది.
‘అప్రమత్తంగానే ఉన్నాం’
ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ.. 2019 నవంబర్లో ఇరాన్ పౌరులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. ఆ సందర్భంలో భద్రతా దళాలు వందల మందిని హతమర్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటనకు మరికొద్ది రోజుల్లో రెండేళ్లు పూర్తికానున్న తరుణంలో తాజాగా ఈ అంతరాయం కలగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే.. ఆన్లైన్ దాడుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నామని ఇరాన్ పేర్కొంది. గతంలోనూ ఈ దేశంలో సైబర్ దాడులు జరిగాయి. అమెరికా, ఇతర పాశ్చాత్య శక్తులే తమ నెట్వర్క్లకు అంతరాయం కలిగించడానికి యత్నిస్తున్నాయని ఇరాన్ ఆరోపించింది. జులైలోనూ రవాణా మంత్రిత్వ శాఖ వెబ్సైట్ మాయం కాగ, అధికారిక మీడియా దాన్ని సైబర్ అంతరాయంగా పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్