90శాతం తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు

దేశంలో 2019తో పోలిస్తే గతేడాది మార్చి నుంచి డిసెంబరు వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు 90.56 శాతం తగ్గినట్లు కేంద్రం తెలిపింది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి భారత్‌లో విమాన ప్రయాణాలను నిలిపేశారు.

Updated : 10 Feb 2021 18:14 IST

దిల్లీ: దేశంలో 2019తో పోలిస్తే గతేడాది మార్చి నుంచి డిసెంబరు వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు 90.56 శాతం తగ్గినట్లు కేంద్రం తెలిపింది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి భారత్‌లో విమాన ప్రయాణాలను నిలిపేశారు. దీంతో 2020లో మార్చి నుంచి డిసెంబరు వరకూ ప్రయాణించిన వారి సంఖ్య 18.55 లక్షలకు పరిమితమైంది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. దేశీయంగా 2019లో సుమారు 12 కోట్ల మంది ప్రయాణాలు చేయగా, 2020లో అది 3.77కోట్లకే పరిమితమైందని తెలిపారు. మార్చిలో ప్రకటించిన అంతర్జాతీయ ప్రయాణాల నిషేధం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ 2020 జులై నుంచి ఎయిర్‌బబుల్‌ ఒప్పందంలో భాగంగా కొన్ని దేశాలకు విమాన ప్రయాణాలకు అనుమతినిచ్చారు. ‘‘విమాన ప్రయాణాల ఆదాయం 2019లో రూ. 46,711 కోట్లు ఉండగా, 2020లో రూ. 11,810కోట్లకు పరిమితమైంది. 2019లో 11,99,45,632 మంది విమానాల్లో ప్రయాణాలు సాగించగా, 2020లో 3,77,79,592 మంది ప్రయాణించారు. ’’ అని రాజ్యసభలో మంత్రి  తెలిపారు. గతేడాది మార్చి 25 నుంచి మే 24 వరకు దేశీయ విమాన ప్రయాణాలను కేంద్రం రద్దు చేసింది. అనంతరం 80శాతం కన్నా తక్కువ మంది ప్రయాణికులతో విమానాలను నడిపేందుకు అనుమతినిచ్చారు.

ఇవీ చదవండి..

19 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్‌

శబరిమలకు ఎక్కువ మందిని అనుమతించలేం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని