ఈ ఏడాది చొరబాట్లు తగ్గాయి: సైనిక కమాండర్
జమ్మూకశ్మీర్లో సరిహద్దు వెంబడి నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని శ్రీనగర్ బేస్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు తెలిపారు. ఈ ఏడాది భద్రతా దళాలు భారీ స్థాయిలో ఉగ్ర చొరబాట్లను అడ్డుకోగలిగాయని ఆయన తెలిపారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో సరిహద్దు వెంబడి నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని శ్రీనగర్ బేస్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు తెలిపారు. ఈ ఏడాది భద్రతా దళాలు భారీ స్థాయిలో ఉగ్ర చొరబాట్లను అడ్డుకోగలిగాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన జమ్మూకశ్మీర్లోని లైట్ ఇంఫాట్రీ రెజిమెంటల్ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న సైనికుల పాసింగ్ అవుట్ పరేడ్లో మాట్లాడారు. జమ్మూకశ్మీర్కు చెందిన 301 మంది యువకులు పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి అదుపులోనే ఉంది. కొన్నిసార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా చొరబాట్లని ప్రోత్సహిస్తుంది. అలాంటి ప్రాంతాల్లోనూ పరిస్థితి నియంత్రణలోనే ఉంది. ఈ ఏడాది భారీ స్థాయిలో చొరబాట్లను అడ్డుకోగలిగాం. గతేడాది 130 ఉగ్రవాద చొరబాట్లకు సంబంధించిన ఘటనలు జరిగాయి. ఆ సంఖ్య ఈ ఏడాది 30కి పడిపోయింది. ఈ అక్రమ చొరబాట్ల సంఖ్య తగ్గడంతో కశ్మీర్ వ్యాలీలో పరిస్థితులు కొంతమేర కుదుటపడ్డాయి’ అని తెలిపారు.
ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ల గురించి మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదులకు వ్యతిరేక ఆపరేషన్లు సైతం కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఓ విదేశీ ఉగ్రవాదితో పాటు, స్థానిక ఉగ్రవాదిని కూడా భద్రతాదళాలు ఎన్కౌంటర్లో మట్టుబెట్టాయి. విదేశీ ఉగ్రవాదులను హతం చేసిన చోట ఆయా ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటున్నాయి. గత మూడు నెలలుగా పుల్వామా, షోపియాన్ ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఆపరేషన్లు నిర్వహించడం కారణంగా ప్రస్తుతం ఆ ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొందరు ఉగ్రవాదులుగా హింసా మార్గాన్ని వదిలిపెట్టి లొంగిపోతున్నారు. అది ఎంతో మంచి విషయం’అని రాజు పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ గురించి ప్రస్తావించగా.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా దళాల తరపున సహాయ సహకారాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. పీఓకేలో క్షిపణులను ఏర్పాటు చేసేందుకు పాక్కు చైనా సహాయం చేస్తోందని వస్తున్న వార్తల గురించి ప్రశ్నించగా.. అలాంటి సూచనలేవీ లేవని కమాండర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు